భారతదేశపు మొట్టమొదటి గాజు వంతెన ఇది, తప్పకుండా చూడాల్సిన ప్రదేశం-indias first glass bridge at kanyakumari is a must see ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  భారతదేశపు మొట్టమొదటి గాజు వంతెన ఇది, తప్పకుండా చూడాల్సిన ప్రదేశం

భారతదేశపు మొట్టమొదటి గాజు వంతెన ఇది, తప్పకుండా చూడాల్సిన ప్రదేశం

Jan 03, 2025, 09:57 AM IST Haritha Chappa
Jan 03, 2025, 09:57 AM , IST

  • భారతదేశంలో ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నాయి.  అనేక నగరాలకు సముద్ర కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి వంతెనలు కడుతూ ఉంటారు. అలాంటిదే గాజు వంతెన. ఈ వంతెనను వివేకానంద మెమోరియల్, కన్యాకుమారిలోని తిరువల్లావర్ విగ్రహం మధ్య నిర్మించారు.

కన్యాకుమారిలో హిందూ మహాసముద్రంపై తిరువల్లావర్ విగ్రహానికి, వివేకానంద మెమోరియల్ హాల్ కు మధ్య గాజు వంతెన నిర్మించారు.

(1 / 6)

కన్యాకుమారిలో హిందూ మహాసముద్రంపై తిరువల్లావర్ విగ్రహానికి, వివేకానంద మెమోరియల్ హాల్ కు మధ్య గాజు వంతెన నిర్మించారు.(Tamilnadu Tourism)

వివేకానంద రాక్, తిరువళ్లావర్ విగ్రహం మధ్య కొత్త గాజు వంతెన నిర్మించారు. రూ.37  కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో   నిర్మించిన ఈ వంతెన కన్యాకుమారికి ప్రత్యేక ప్రదేశంగా మారింది. మన దేశంలోనే తొలి గాజు వంతెన ఇది. 

(2 / 6)

వివేకానంద రాక్, తిరువళ్లావర్ విగ్రహం మధ్య కొత్త గాజు వంతెన నిర్మించారు. రూ.37  కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో   నిర్మించిన ఈ వంతెన కన్యాకుమారికి ప్రత్యేక ప్రదేశంగా మారింది. మన దేశంలోనే తొలి గాజు వంతెన ఇది. 

ఇంతకు ముందు, పర్యాటకులు వివేకానంద రాక్, తిరువళ్లువర్ విగ్రహాన్ని సందర్శించడానికి ఫెర్రీ సేవపై ఆధారపడేవారు. ఇప్పుడు ఈ వంతెన ఈ రెండింటి మధ్య ఉత్తమ అనుసంధానం. ఇప్పుడు కాలినడకన  వెళ్లవచ్చు. 

(3 / 6)

ఇంతకు ముందు, పర్యాటకులు వివేకానంద రాక్, తిరువళ్లువర్ విగ్రహాన్ని సందర్శించడానికి ఫెర్రీ సేవపై ఆధారపడేవారు. ఇప్పుడు ఈ వంతెన ఈ రెండింటి మధ్య ఉత్తమ అనుసంధానం. ఇప్పుడు కాలినడకన  వెళ్లవచ్చు. 

అధునాతన నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించిన ఈ గాజు వంతెన దాని మన్నికను నిర్ధారించడమే కాకుండా దాని గుండా వెళ్లే వారి భద్రతను కూడా ఇస్తుంది.

(4 / 6)

అధునాతన నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించిన ఈ గాజు వంతెన దాని మన్నికను నిర్ధారించడమే కాకుండా దాని గుండా వెళ్లే వారి భద్రతను కూడా ఇస్తుంది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ గాజు వంతెన కోత, బలమైన సముద్రపు గాలులతో సహా కఠినమైన సముద్ర పరిస్థితులను తట్టుకునేలా నిర్మించారు. దీనిని పగలు,రాత్రి సమయంలో ఆపరేట్ చేయవచ్చు.

(5 / 6)

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ గాజు వంతెన కోత, బలమైన సముద్రపు గాలులతో సహా కఠినమైన సముద్ర పరిస్థితులను తట్టుకునేలా నిర్మించారు. దీనిని పగలు,రాత్రి సమయంలో ఆపరేట్ చేయవచ్చు.

ఈ ప్రాజెక్టు అమలుపై వ్యక్తిగతంగా ఆసక్తి చూపిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గాజు వంతెనపై నడుచుకుంటూ ప్రాజెక్టును ప్రారంభించారు.

(6 / 6)

ఈ ప్రాజెక్టు అమలుపై వ్యక్తిగతంగా ఆసక్తి చూపిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గాజు వంతెనపై నడుచుకుంటూ ప్రాజెక్టును ప్రారంభించారు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు