(1 / 4)
2023-25 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరడంలో టీమిండియా విఫలమైంది. ఇక ఇప్పుడు 2025-27 టెస్టు ఛాంపియన్షిప్ వేటను ప్రారంభిస్తోంది. ఇంగ్లండ్ తో భారత్ ఐదు టెస్టులు ఆడనుంది. మరి భారత్-ఇంగ్లండ్ హై వోల్టేజ్ సిరీస్ లో తొలి టెస్టు ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో ఓ లుక్కేయండి.
(2 / 4)
ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. లీడ్స్ లోని హెడింగ్లీలో ఈ మ్యాచ్ జరగనుంది. హై వోల్టేజ్ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ 30 నిమిషాలు ముందుగా అంటే మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది.
(3 / 4)
భారత్-ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ 2025-27 టెస్టు సిరీస్ ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. సోనీ స్పోర్ట్స్ 1, సోనీ స్పోర్ట్స్ 5, సోనీ స్పోర్ట్స్ 3 హిందీ, సోనీ స్పోర్ట్స్ 4 తమిళ, తెలుగు ఛానళ్లలో తొలి మ్యాచ్ ప్రసారం కానుంది. ఇక ఈ మ్యాచ్ స్ట్రీమింగ్ హక్కులు జియోహాట్స్టార్ చేతిలో ఉండటం విశేషం.
(4 / 4)
టెస్టు క్రికెట్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు మొత్తం 136 మ్యాచ్ లు ఆడాయి. ఇంగ్లాండ్ 51 టెస్టుల్లో విజయం సాధించింది. భారత్ 35 మ్యాచుల్లో గెలిచింది. ఇరు జట్ల మధ్య యాభై టెస్టులు డ్రా అయ్యాయి.
ఇతర గ్యాలరీలు