(1 / 6)
దేశీయ ఆన్లైన్ రిటైల్ వ్యాపారంలో చిన్న రిటైలర్లకు తోడ్పాటు అందించేందుకు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలి దశలో 5 నగరాల్లో ఓఎన్డీసీ ఆవిష్కరించింది
(Twitter)(2 / 6)
ఢిల్లీ (ఎన్సీఆర్), బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్ నగరాల్లో ఈ ఓఎన్డీసీని ఆవిష్కరించారు. ఈ–కామర్స్ ప్రయోజనాలు అందరికీ అందేలా.. ఎంపిక చేసిన వినియోగదారులు, అమ్మకదారులకు, లాజిస్టిక్స్ సంస్థలకు ఈ ఓఎన్డీసీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నట్లుగా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు
(Twitter)(3 / 6)
ఈ నగరాల్లో 150 రిటైలర్లను ఇందులోకి తీసుకురావడమే ఈ పైలట్ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వాణిజ్య ప్రోత్సాహకాల విభాగం(DPIIT) అదనపు కార్యదర్శి అనిల్ అగర్వాల్ తెలిపారు
(Reuters)(4 / 6)
ఆరు నెలల్లో 100 నగరాల్లో ఓఎన్డీసీని విస్తరించి భవిష్యత్లో 3 కోట్ల మంది అమ్మకపుదారులను, కోటి మంది రిటైల్ వ్యాపారులను ఆన్లైన్లోకి తీసుకురావడమే లక్ష్యం పెట్టుకున్నట్లు అనిల్ అగర్వాల్ వివరించారు.
(Reuters)(5 / 6)
ఇక గ్రామీణ ప్రాంత వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రాంతీయ భాషల్లోనూ ఈ యాప్లను ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు అగ్రవాల్ వివరించారు.
(Reuters)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు