
(1 / 8)
భారత్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్లో విజృంభిస్తున్నాడు. రెండు, మూడు టెస్టుల్లో వరుసగా డబుల్ సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్పై రెండు టెస్టు డబుల్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు.
(ANI)(2 / 8)
ఇంగ్లండ్పై ఈ సిరీస్లో రెండు, మూడు టెస్టుల్లో టీమిండియా గెలువడంలో జైస్వాల్ కీలకపాత్ర పోషించాడు. డబుల్ సెంచరీలతో జట్టుకు మంచి స్కోర్లు అందించాడు. తన ఏడు టెస్టుల్లోనే రెండు ద్విశతకాలను నమోదు చేశాడు జైస్వాల్.
(REUTERS)
(3 / 8)
అయితే, డబుల్ సెంచరీలు చేసినా.. రెండు టెస్టుల్లోనూ జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కలేదు.
(AFP)
(4 / 8)
విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 209 పరుగులతో డబుల్ సెంచరీ చేశాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమైనా టీమిండియాకు మంచి స్కోరు అందించాడు. అయితే, ఆ మ్యాచ్లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. ఫ్లాట్ పిచ్పై బుమ్రా సత్తాచాటాడు. దీంతో ఈ రెండో టెస్టులో బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
(PTI)
(5 / 8)
రాజ్కోట్లో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (214 నాటౌట్) అజేయంగా డబుల్ సెంచరీ చేశాడు. అయితే, ఈ టెస్టులో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేయటంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్లో ఐదు వికెట్లతో సత్తాచాటాడు. టీమిండియా గెలుపులో అతడు కూడా కీలకపాత్ర పోషించాడు. దీంతో జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
(PTI)
(6 / 8)
ఇలా ఇంగ్లండ్తో వరుస మ్యాచ్ల్లో డబుల్ సెంచరీలు చేసినా జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కలేదు.
(PTI)
(7 / 8)
కాగా, రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో మ్యాచ్ నాలుగో రోజైన నేడు (ఫిబ్రవరి 18) టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై గెలిచింది. టెస్టు చరిత్రలో పరుగుల పరంగా భారత్కు ఇదే అతిపెద్ద విజయం.
(ANI )
(8 / 8)
మూడో టెస్టులో గెలుపుతో ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ముందంజ వేసింది భారత్. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రాంచీలో ఫిబ్రవరి 23న మొదలుకానుంది.
(AP)ఇతర గ్యాలరీలు