(1 / 5)
కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 బైక్ ను హీరో మోటోకార్ప్ మరోసారి మార్కెట్లోకి తీసుకువస్తోంది. పూర్తిగా అత్యాధునికంగా ఈ బైక్ ను తీర్చిదిద్దారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఈ బైక్ కు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నారు. గతంలో ఈ సెగ్మెంట్ లో బెస్ట్ సెల్లర్ గా నిలిచిన ఈ బైక్.. మళ్లీ మార్కెట్ లీడర్ గా నిలుస్తుందని హీరో మోటోకార్ప్ భావిస్తోంది.
(2 / 5)
కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 మూడు రంగుల్లో లభిస్తుంది. అవి ఐకానిక్ యెల్లో, టర్బో రెడ్, మాటీ ఫాంటమ్ బ్లాక్. ఇందులో రెండు కలర్స్ గతంలో వచ్చిన మోడల్ వే. కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 బైక్ ఎక్స్ షో రూమ్ ధర రూ.172,900 గా ఉంది. ఈ బైక్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
(3 / 5)
స్పోర్టీ, స్టైలిష్ లుక్ తో మరింత ఆకర్షణీయంగా ఈ బైక్ ను తీర్చిదిద్దారు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ తో పాటు డే టైమ్ రన్నింగ్ లైట్ ను కూడా స్టైలిష్ గా రూపొందించారు. స్ప్లిట్ సీట్, చంకీ ఫ్యుయెల్ ట్యాంక్, స్ల్పిట్ గ్రాబ్ రెయిల్ లు యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి.
(4 / 5)
గత కరిజ్మాతో పోలిస్తే, కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇందులో ఎల్ సీడీ కలర్ డిస్ ప్లే తో ఉన్న ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ.. మొదలైనవి ఉన్నాయి.
(5 / 5)
ఈ బైక్ లో 210 సీసీ డీఓహెచ్సీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ను అమర్చారు. ఇది 25.15 పీక్ పవర్ ను, 20.4 ఎన్ఎం పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది.
ఇతర గ్యాలరీలు