(1 / 7)
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 1.66 బిలియన్ యెన్ను(దాదాపు రూ. 94కోట్లు) ఖర్చు చేసేందుకు ప్రభుత్వం చూస్తోందని సమాచారం.
(2 / 7)
ఇటీవలే బ్రిటన్లో క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు ముగిశాయి. ఇందుకోసం 1.3 బిలియన్ యెన్ ఖర్చు అయినట్టు నివేదికలు వచ్చాయి. ఇక 1.66 బిలియన్ యెన్ను ఖర్చు చేస్తే.. షింజో అబే అంత్యక్రియలు.. క్వీన్ ఎలిజబెత్ కార్యక్రమాలను మించిపోతాయి!
(3 / 7)
అనేక దేశాధినేతలు షింజో అబే అంత్యక్రియలకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో వారి భద్రత, వసతి కోసం భారీగా ఖర్చు అవుతుంది.
(4 / 7)
షింజో అబే అంత్యక్రియల కోసం కేటాయించిన నిధులలో సగం.. దేశాధినేతల భద్రత కోసమే వినియోగించనున్నట్టు తెలుస్తోంది.
(5 / 7)
217 దేశాల నుంచి 700మంది అతిథులు షింజో అబే అంత్యక్రియలకు వెళ్లనున్నారు.
(6 / 7)
ప్రధాని నరేంద్ర మోదీ.. మంగళవారం జపాన్కు వెళ్లనున్నారు. షింజో అబే అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. మోదీ.. షింజో అబేకి మంచి మిత్రుడు అని ప్రపంచానికి తెలిసిన విషయమే.
(7 / 7)
జపాన్కు సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన షింజో అబే.. జులై 8న దారుణ హత్యకు గురయ్యారు. ప్రపంచం ఉల్లిక్కిపడే విధంగా.. ఓ వ్యక్తి.. షింజో అబేని చంపేశాడు.
ఇతర గ్యాలరీలు