న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట- ఫొటోలు చూస్తేనే భయపడిపోతారు!
- మహా కుంభమేళా కోసం వేలాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వెళ్తుండగా శనివారం రాత్రి 10 గంటలకు న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు.
- మహా కుంభమేళా కోసం వేలాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వెళ్తుండగా శనివారం రాత్రి 10 గంటలకు న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు.
(1 / 8)
న్యూదిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 18కి చేరింది. ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నుంచి కొందరు ప్రయాణికులు కిందకు దిగుతుండగా జారిపడటంతో గందరగోళం మొదలైందని, మరికొందరు వారిపై పడిపోయారని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
(AP)(2 / 8)
శనివారం నాడు న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో మహా కుంభమేళా కోసం రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రయాణీకుల రద్దీ. 14, 15 ప్లాట్ఫాంలు కిక్కిరిసిపోవడంతో ప్రయాగ్రాజ్కు వెళ్లే భక్తుల తాకిడి పెరిగింది. ఈ తొక్కిసలాటలో డజను మందికి పైగా గాయపడ్డారు.
(PTI)(3 / 8)
శనివారం జరిగిన ఘోర తొక్కిసలాట తరువాత న్యూదిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఒక దృశ్యం ఇది. అకస్మాత్తుగా ప్రయాణికుల రద్దీ ఈ గందరగోళానికి దారితీసిందని, చాలా మంది ఊపిరాడక కుప్పకూలిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
(Hindustan Times)(4 / 8)
ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ బయలుదేరే సమయానికి ప్లాట్ఫాం 14 అప్పటికే రద్దీగా ఉందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (రైల్వే) ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ ఆలస్యమవడంతో పరిస్థితి విషమించి 12, 13, 14 ప్లాట్ ఫామ్లపై రద్దీ పెరిగింది.
(PTI)(5 / 8)
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు వెళ్లే రైళ్లలో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న ప్రయాణికుల ఫొటోలు ఇవి.
(PTI)ఇతర గ్యాలరీలు