Union Budget 2023 : కేంద్ర బడ్జెట్ను కేవలం 800 పదాల్లో ముగించేశారు!
Union Budget 2023 : ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కేంద్రం. నిర్మలా సీతారామన్ ప్రసంగంపై భారతీయులు కోటి ఆశలు పెట్టుకున్నారు! ఈ క్రమంలో బడ్జెట్ విషయంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాము.
(1 / 7)
దేశాభివృద్ధి, రాజకీయాల్లో మరో కీలక ఘట్టం! ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీకి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది.(Amlan Paliwal)
(2 / 7)
దేశ బడ్జెట్ చరిత్రలో సుదీర్ఘ ప్రసంగాలు చేసిన ఆర్థికమంత్రిగా నిలిచారు నిర్మలా సీతారామన్.(HT)
(3 / 7)
1977లో కేవలం 800 పదాలతో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు నాటి ఆర్థికమంత్రి హీరాభాయ్ ములిజిభాయ్ పటేల్.
(4 / 7)
ఇక 2020లో 2 గంటల 42 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు నిర్మలా సీతారామన్. ఇదొక రికార్డు.(Shrikant Singh)
(5 / 7)
బడ్జెట్లో వినియోగించే పదాలను ప్రామాణికంగా తీసుకుంటే.. సుదీర్ఘమైన పద్దును డెలివరీ చేశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. పీవీ నరసింహా రావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన.. 18,650 పదాలతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.(Rahul Singh)
(6 / 7)
అత్యధిక బడ్జెట్ ప్రసంగాలు చేసిన వారిలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మొదటి స్థానంలో ఉన్నారు. 1962-69లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మొత్తం మీద 10సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ఇతర గ్యాలరీలు