(1 / 7)
ఢిల్లీ-ఎన్సీఆర్లో అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రోజువారీ కార్మికులు ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలో గంట వ్యవధిలో 50 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
((Photo by Sunil Ghosh / Hindustan Times))(2 / 7)
ఢిల్లీ-ఎన్సిఆర్లో అకస్మాత్తుగా ప్రారంభమైన వర్షం వాహనదారులను ఇబ్బందుల పాలు చేసింది. రాత్రి 8.30 గంటల తర్వాత వర్షం తీవ్రత తగ్గింది. కానీ, పలు ప్రాంతాల్లో తెల్లవారు జామున 3 గంటల వరకు చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.
((Photo by Sunil Ghosh / Hindustan Times))(3 / 7)
బుధవారం సాయంత్రం గంటపాటు కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకస్మాత్తుగా వర్షం ప్రారంభం కావడం, అది ఆఫీస్ ల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
((Photo by Sunil Ghosh / Hindustan Times))(4 / 7)
భారీ వర్షం కారణంగా ఢిల్లీ-నోయిడా ఫ్లైవేలోని పలు స్ట్రెచ్ లలో ట్రాఫిక్ జామ్ అయింది. విమానాశ్రయానికి వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
((Photo by Sunil Ghosh / Hindustan Times))(5 / 7)
(6 / 7)
గురుగ్రామ్ లోని బెరివాలా బాగ్ రోడ్ సెక్టార్-11 వద్ద భారీ వర్షానికి వాహనాలు నీట మునిగాయి. లోధి కాలనీ, పాటియాలా హౌస్ కోర్టు, చాణక్యపురి, కాకా నగర్ తదితర ప్రాంతాల్లో కూడా నీరు నిలిచిపోయింది.
((Photo by Parveen Kumar/Hindustan Times))(7 / 7)
ఇతర గ్యాలరీలు