డబ్ల్యూటీసీ విన్నర్‌కు జాక్‌పాట్‌.. భారీగా పెరిగిన ప్రైజ్‌మ‌నీ.. ఫైనల్ చేరని టీమిండియాకు ఎన్ని కోట్లంటే?-icc announced whopping prize money for world test championship final 2025 winner third placed indian cricket team 12 cr ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  డబ్ల్యూటీసీ విన్నర్‌కు జాక్‌పాట్‌.. భారీగా పెరిగిన ప్రైజ్‌మ‌నీ.. ఫైనల్ చేరని టీమిండియాకు ఎన్ని కోట్లంటే?

డబ్ల్యూటీసీ విన్నర్‌కు జాక్‌పాట్‌.. భారీగా పెరిగిన ప్రైజ్‌మ‌నీ.. ఫైనల్ చేరని టీమిండియాకు ఎన్ని కోట్లంటే?

Published May 15, 2025 04:15 PM IST Chandu Shanigarapu
Published May 15, 2025 04:15 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) విజేతగా నిలిచే టీమ్ కు భారీ జాక్ పాట్ తగలనుంది. డబ్ల్యూటీసీ ప్రైజ్ మనీని గురువారం (మే 15) ఐసీసీ అనౌన్స్ చేసింది. గతంలో కంటే ప్రైజమనీ దాదాపు డబుల్ అయింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. 2023-25 సైకిల్ కు 5.76 మిలియన్ డాలర్లు (రూ.49.27 కోట్లతో) ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది. గతంలో కంటే ఇది రెండింతలు.

(1 / 5)

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. 2023-25 సైకిల్ కు 5.76 మిలియన్ డాలర్లు (రూ.49.27 కోట్లతో) ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది. గతంలో కంటే ఇది రెండింతలు.

(x/ThomasLyte)

జూన్ 11న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య లార్డ్స్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 స్టార్ట్ అవుతుంది. ఇందులో గెలిచిన టీమ్ గదతో పాటు 3.6 మిలియన్ డాలర్లు (రూ.30.80 కోట్లు) సొంతం చేసుకుంటుంది. 2021, 2023లో ఇచ్చిన 1.6 మిలియన్ డాలర్ల (రూ.13.67 కోట్ల) కంటే ఇది రెట్టింపు కంటే ఎక్కువ.

(2 / 5)

జూన్ 11న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య లార్డ్స్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 స్టార్ట్ అవుతుంది. ఇందులో గెలిచిన టీమ్ గదతో పాటు 3.6 మిలియన్ డాలర్లు (రూ.30.80 కోట్లు) సొంతం చేసుకుంటుంది. 2021, 2023లో ఇచ్చిన 1.6 మిలియన్ డాలర్ల (రూ.13.67 కోట్ల) కంటే ఇది రెట్టింపు కంటే ఎక్కువ.

(Action Images via Reuters)

డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 రన్నరప్ టీమ్ 2.16 మిలియన్ డాలర్లు (రూ.18.48 కోట్లు) ఖాతాలో వేసుకుంటాయి. గతంలో రన్నరప్ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ.6.84 కోట్లు) ఇచ్చేవాళ్లు.

(3 / 5)

డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 రన్నరప్ టీమ్ 2.16 మిలియన్ డాలర్లు (రూ.18.48 కోట్లు) ఖాతాలో వేసుకుంటాయి. గతంలో రన్నరప్ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ.6.84 కోట్లు) ఇచ్చేవాళ్లు.

(x/icc)

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరలేకపోయిన టీమిండియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. భారత్ 1.44 మిలియన్ డాలర్లు (రూ.12.32 కోట్లు) సొంతం చేసుకుంటుంది. నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ 1.20 మిలియన్ డాలర్లు దక్కించుకుంటుంది.

(4 / 5)

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరలేకపోయిన టీమిండియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. భారత్ 1.44 మిలియన్ డాలర్లు (రూ.12.32 కోట్లు) సొంతం చేసుకుంటుంది. నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ 1.20 మిలియన్ డాలర్లు దక్కించుకుంటుంది.

(x/bcci)

ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఫైనల్ బరిలో దిగుతోంది. దక్షిణాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోతోంది. భారత్ లేకుండా తొలిసారి ఈ టైటిల్ పోరు జరగబోతోంది. 2021, 2023 ఫైనల్లో ఆడిన భారత్.. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడింది.

(5 / 5)

ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఫైనల్ బరిలో దిగుతోంది. దక్షిణాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోతోంది. భారత్ లేకుండా తొలిసారి ఈ టైటిల్ పోరు జరగబోతోంది. 2021, 2023 ఫైనల్లో ఆడిన భారత్.. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడింది.

(x/ProteasMenCSA)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు