(1 / 6)
బోనాలు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. సోమవారం స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
(2 / 6)
ఇవాళ పాతబస్తీ లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు.
(3 / 6)
జులై 7న హైదరాబాద్ లో ప్రారంభమైన బోనాలు, ఆగస్టు 4 వరకు కొనసాగనున్నాయి. బోనాలు పండుగను తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.
(4 / 6)
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి పెద్ద సంఖ్యలో భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
(5 / 6)
చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
(6 / 6)
అంబర్పేటలో మహాకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. భక్తులు స్థానిక దేవాలయాల్లో బోనాలు సమర్పిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు