(1 / 6)
గ్రూప్-1 (మెయిన్స్) పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రం (టీజీ బీసీఈఎస్డీటీసీ) డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
(2 / 6)
75 రోజులపాటు నిర్వహించే శిక్షణ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తును www.tgbcstudycircle.cgg.gov.in లో సమర్పించాలి.
(3 / 6)
గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి. రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
(4 / 6)
ఉచిత శిక్షణకు ఎంపికైన వారికి శిక్షణా కాలంలో నెలకు రూ.5000 ఉపకార వేతనం (బుక్ ఫండ్, రవాణా సహా) అందజేస్తారు.
(5 / 6)
గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణ హైదరాబాద్ సైదాబాద్లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ (రోడ్ నెం: 8, లక్ష్మీనగర్), ఖమ్మంలోని టీజీ బీసీ స్టడీ సర్కిల్లో అందజేస్తారు. మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ 040-24071188 నెంబర్ సంప్రదించవచ్చు.
(6 / 6)
xతెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. మెయిన్స్కు 1:50 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించారు. మరోవైపు ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి.
ఇతర గ్యాలరీలు