(1 / 8)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలో సందడి చేశారు.
(2 / 8)
చార్మినార్ సమీపంలోని ఫేమస్ షాదాబ్ రెస్టారెంట్ కు వెళ్లిన మంత్రి కేటీఆర్... అక్కడి ప్రజలతో ముచ్చటించి వారితో కలిసి బిర్యానీ తిన్నారు.
(3 / 8)
అనంతరం మోజంజాహిలో.. స్థానికులతో కేటీఆర్ ఐస్ క్రీమ్ రుచి చూశారు.
(4 / 8)
గత వారం నిలోఫర్ కేఫ్ లో సందడి చేసిన కేటీఆర్ తాజాగా పాతబస్తీలో ప్రజలతో మమేకం అయ్యారు.
(5 / 8)
మంత్రి కేటీఆర్ శుక్రవారం ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షో ముగిసిన అనంతరం కేటీఆర్ నేరుగా చార్మినార్ షాదాబ్ రెస్టారెంట్ కి వెళ్లారు.
(6 / 8)
రెస్టారెంట్ లో ఉన్న ప్రజలు, సిబ్బంది మంత్రి కేటీఆర్ ను చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం మంత్రి బిర్యానీ ఆర్డర్ చేసి సామాన్య ప్రజలతో ముచ్చటిస్తూ బిర్యానీ తిన్నారు.
(7 / 8)
అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ అక్కడ నుంచి మోజంజాహి మార్కెట్ కు వెళ్లారు కేటీఆర్.
(8 / 8)
మోజంజాహి మార్కెట్ లో ఫేమస్ ఐస్ క్రీమ్ ను కేటీఆర్ తిన్నారు. కేటీఆర్ రాకతో చార్మినార్, మోజంజాహి ప్రాంతాలు సందడిగా మారాయి.
ఇతర గ్యాలరీలు