అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ -2025 పోటీలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు-hyderabad miss world 2025 kicks off with grand opening captivating cultural performances ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ -2025 పోటీలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ -2025 పోటీలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Published May 10, 2025 10:11 PM IST Bandaru Satyaprasad
Published May 10, 2025 10:11 PM IST

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 120కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడుతున్నారు. మిస్ వరల్డ్ -2025 పోటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు  అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 120కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడుతున్నారు.

(1 / 7)

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 120కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడుతున్నారు.

వరుసగా రెండో సారి మిస్ వరల్డ్ పోటీలు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. మే 10న ప్రారంభమైన ఈ పోటీలు...మే 31తో ముగియనున్నాయి. భారత్‌ తరఫున మిస్‌ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం ఇస్తున్నారు. మిస్ వరల్డ్ -2025 పోటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

(2 / 7)

వరుసగా రెండో సారి మిస్ వరల్డ్ పోటీలు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. మే 10న ప్రారంభమైన ఈ పోటీలు...మే 31తో ముగియనున్నాయి. భారత్‌ తరఫున మిస్‌ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం ఇస్తున్నారు. మిస్ వరల్డ్ -2025 పోటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతంతో మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.

(3 / 7)

గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతంతో మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.

250 మంది కళాకారులు చేసిన పేరిణి నృత్య ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. ప్రారంభ సెర్మనీలో భాగంగా పోటీదారులు వారి దేశ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.

(4 / 7)

250 మంది కళాకారులు చేసిన పేరిణి నృత్య ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. ప్రారంభ సెర్మనీలో భాగంగా పోటీదారులు వారి దేశ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.

హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు

(5 / 7)

హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు

మి స్‌వరల్డ్‌ అందాల పోటీలకు భారీగా పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. 5 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పటిష్టమైన భద్రత కల్పించారు.

(6 / 7)

మి స్‌వరల్డ్‌ అందాల పోటీలకు భారీగా పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. 5 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పటిష్టమైన భద్రత కల్పించారు.

మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా, తెలంగాణ సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

(7 / 7)

మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా, తెలంగాణ సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు