(1 / 7)
హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 120కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడుతున్నారు.
(2 / 7)
వరుసగా రెండో సారి మిస్ వరల్డ్ పోటీలు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. మే 10న ప్రారంభమైన ఈ పోటీలు...మే 31తో ముగియనున్నాయి. భారత్ తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం ఇస్తున్నారు. మిస్ వరల్డ్ -2025 పోటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
(3 / 7)
గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతంతో మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
(4 / 7)
250 మంది కళాకారులు చేసిన పేరిణి నృత్య ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. ప్రారంభ సెర్మనీలో భాగంగా పోటీదారులు వారి దేశ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.
(5 / 7)
హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు
(6 / 7)
మి స్వరల్డ్ అందాల పోటీలకు భారీగా పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. 5 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పటిష్టమైన భద్రత కల్పించారు.
ఇతర గ్యాలరీలు