హైదరాబాద్‌లో సవరించిన మెట్రో ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి… కనీస ప్రయాణ ఛార్జీ రూ.11-hyderabad metro fare hike with 10percent discount from tomorrow ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  హైదరాబాద్‌లో సవరించిన మెట్రో ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి… కనీస ప్రయాణ ఛార్జీ రూ.11

హైదరాబాద్‌లో సవరించిన మెట్రో ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి… కనీస ప్రయాణ ఛార్జీ రూ.11

Published May 23, 2025 01:33 PM IST Sarath Chandra.B
Published May 23, 2025 01:33 PM IST

హైదరాబాద్‌లో సవరించిన మెట్రో ప్రయాణ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్‌ మెట్రలో ప్రయాణ ఛార్జీలను 20శాతం పెంచాలని నిర్ణయించినా.. వ్యతిరేకత రావడంతో పదిశాతానికి తగ్గించారు. మొదటి రెండు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.11 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.69 వసూలు చేస్తారు.

హైదరాబాద్‌లో సవరించిన మెట్రో ప్రయాణ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.

(1 / 7)

హైదరాబాద్‌లో సవరించిన మెట్రో ప్రయాణ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.

మెట్రో ప్రయాణ ఛార్జీలను పెంచుతూ ఇటీవల ఎల్‌ అండ్‌ టీ మెట్రో తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది.దీంతో ధరలపై డిస్కౌంట్ ప్రకటించారు.

(2 / 7)

మెట్రో ప్రయాణ ఛార్జీలను పెంచుతూ ఇటీవల ఎల్‌ అండ్‌ టీ మెట్రో తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది.దీంతో ధరలపై డిస్కౌంట్ ప్రకటించారు.

(istockphoto)

గత వారం మెట్రో ప్రయాణ ఛార్జీలలో డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు ఎల్‌ అండ్‌ టి ప్రకటించింది. 2కి.మీ కనిష్ట ప్రయాణానికి  కనీస ధరగా రూ.11 ఛార్జీని నిర్ణయించారు. హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణానికి గరిష్టంగా రూ.69ఛార్జీ నిర్ణయించారు. ఇవి శనివారం నుంచి అమల్లోకి వస్తాయి.

(3 / 7)

గత వారం మెట్రో ప్రయాణ ఛార్జీలలో డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు ఎల్‌ అండ్‌ టి ప్రకటించింది. 2కి.మీ కనిష్ట ప్రయాణానికి కనీస ధరగా రూ.11 ఛార్జీని నిర్ణయించారు. హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణానికి గరిష్టంగా రూ.69ఛార్జీ నిర్ణయించారు. ఇవి శనివారం నుంచి అమల్లోకి వస్తాయి.

హైదరాబాద్‌ మెట్రలో ప్రయాణ ఛార్జీలను 20శాతం పెంచాలని నిర్ణయించినా వ్యతిరేకత రావడంతో పదిశాతానికి తగ్గించారు. మొదటి రెండు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.11 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.  రెండు నుంచి 4 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.17 ఛార్జీ వసూలు చేస్తారు.

(4 / 7)


హైదరాబాద్‌ మెట్రలో ప్రయాణ ఛార్జీలను 20శాతం పెంచాలని నిర్ణయించినా వ్యతిరేకత రావడంతో పదిశాతానికి తగ్గించారు. మొదటి రెండు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.11 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రెండు నుంచి 4 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.17 ఛార్జీ వసూలు చేస్తారు.

(@ltmhyd)

మెట్రోలో 4 నుంచి ఆరు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.28, 6 నుంచి 9 కిలోమీటర్ల ప్రయాణానికి  రూ.37 ఛార్జీ వసూలు చేస్తారు. 12 నుంచి 15 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.51 ఛార్జీ వసూలు చేస్తారు. 15 నుంచి 18 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.56 వసూలు చేస్తారు.

(5 / 7)

మెట్రోలో 4 నుంచి ఆరు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.28, 6 నుంచి 9 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.37 ఛార్జీ వసూలు చేస్తారు. 12 నుంచి 15 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.51 ఛార్జీ వసూలు చేస్తారు. 15 నుంచి 18 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.56 వసూలు చేస్తారు.

18 నుంచి 21 మీటర్ల ప్రయాణానికి రూ.61, 21 నుంచి 24 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.65 వసూలు చేస్తారు.  గరిష్టంగా రూ.69 ఛార్జీ చేస్తారు.

(6 / 7)

18 నుంచి 21 మీటర్ల ప్రయాణానికి రూ.61, 21 నుంచి 24 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.65 వసూలు చేస్తారు. గరిష్టంగా రూ.69 ఛార్జీ చేస్తారు.

(@Kavalichandrak1)

మెట్రో ప్రయాణ ఛార్జీలను కనీసం రూ.10 నుంచి 12కు, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచాలని మెట్రో యాజమాన్యం భావించింది. తర్వాత దానిలో 10శాతం డిస్కౌంట్ ప్రకటించారు.

(7 / 7)

మెట్రో ప్రయాణ ఛార్జీలను కనీసం రూ.10 నుంచి 12కు, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచాలని మెట్రో యాజమాన్యం భావించింది. తర్వాత దానిలో 10శాతం డిస్కౌంట్ ప్రకటించారు.

(X/Peter Chirkov)

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

ఇతర గ్యాలరీలు