Hyderabad ExPerium Park : హైదరాబాద్ లో ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్ అట్రాక్షన్ -150 ఎకరాల్లో ఎక్స్ పీరియం పార్క్, ప్రత్యేకలివే-hyderabad experium park build in 150 acre crore worth of trees best eco friendly tourist spot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad Experium Park : హైదరాబాద్ లో ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్ అట్రాక్షన్ -150 ఎకరాల్లో ఎక్స్ పీరియం పార్క్, ప్రత్యేకలివే

Hyderabad ExPerium Park : హైదరాబాద్ లో ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్ అట్రాక్షన్ -150 ఎకరాల్లో ఎక్స్ పీరియం పార్క్, ప్రత్యేకలివే

Jan 28, 2025, 06:56 PM IST Bandaru Satyaprasad
Jan 28, 2025, 06:56 PM , IST

Hyderabad ExPerium Park : హైదరాబాద్ పర్యాటక ఆకర్షణలో మరో సుందరమైన ప్రదేశం చేరింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవస్థానం మార్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ఏర్పాటుచేశారు. ఈ పార్క్ ప్రత్యేకతలు తెలుసుకుందాం.

హైదరాబాద్ పర్యాటక ఆకర్షణలో మరో సుందరమైన ప్రదేశం చేరింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవస్థానం మార్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ఏర్పాటుచేశారు. ఈ పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. 

(1 / 6)

హైదరాబాద్ పర్యాటక ఆకర్షణలో మరో సుందరమైన ప్రదేశం చేరింది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవస్థానం మార్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ఏర్పాటుచేశారు. ఈ పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. 

ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఎక్స్ పీరియం పార్క్.  150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎకో రిక్రియేషనల్ పార్క్ ఇది. ఇందులో ప్రకృతి, కళ, పురాణాలను మిళితం చేశారు. 

(2 / 6)

ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఎక్స్ పీరియం పార్క్.  150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎకో రిక్రియేషనల్ పార్క్ ఇది. ఇందులో ప్రకృతి, కళ, పురాణాలను మిళితం చేశారు. 

(Image Source : Hi Hyderabad X Account)

15,000లకు పైగా వృక్ష జాతులు, అరుదైన చెట్లు, సజీవ శిల్పాలతో ఎంతో సృజనాత్మకతతో ఎక్స్ పీరియం పార్క్ ను ఏర్పాటుచేశారు. జపనీస్ తోటలు, 3,000 ఏళ్ల నాటి చెట్లు, పూల మండలాలు, అడ్వెంచర్ మార్గాలు, లగ్జరీ స్టేలను ఆస్వాదించవచ్చు. 

(3 / 6)

15,000లకు పైగా వృక్ష జాతులు, అరుదైన చెట్లు, సజీవ శిల్పాలతో ఎంతో సృజనాత్మకతతో ఎక్స్ పీరియం పార్క్ ను ఏర్పాటుచేశారు. జపనీస్ తోటలు, 3,000 ఏళ్ల నాటి చెట్లు, పూల మండలాలు, అడ్వెంచర్ మార్గాలు, లగ్జరీ స్టేలను ఆస్వాదించవచ్చు. 

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఎక్స్​ పీరియం పార్కును నిర్మించారు. ఈ పార్కులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 15 వేల జాతుల మొక్కలను ఉంచారు. 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్​ను నిర్మించారు. 

(4 / 6)

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఎక్స్​ పీరియం పార్కును నిర్మించారు. ఈ పార్కులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 15 వేల జాతుల మొక్కలను ఉంచారు. 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్​ను నిర్మించారు. 

(Image Source : Hi Hyderabad X Account)

రాందేవ్​రావు ఆరున్నరేళ్లుగా పాటు శ్రమించి ఎక్స్ పీరియం పార్క్​ను తీర్చిదిద్దారు. ఇందులో రూ.లక్ష నుంచి రూ.3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలు ఉన్నాయి. ఇప్పటికే  అరుదైన వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు. 

(5 / 6)

రాందేవ్​రావు ఆరున్నరేళ్లుగా పాటు శ్రమించి ఎక్స్ పీరియం పార్క్​ను తీర్చిదిద్దారు. ఇందులో రూ.లక్ష నుంచి రూ.3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలు ఉన్నాయి. ఇప్పటికే  అరుదైన వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు. 

(Image Source : Hi Hyderabad X Account)

రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా ఎక్స్​పీరియం పార్కు అని నిర్వాహకులు అంటున్నారు. ఈ పార్క్ లో రూ.5 లక్షల నుంచి రూ.కోటి విలువైన శిల్పాలు ఉన్నాయి. చెట్లతో చేసిన అత్యధిక సజీవ శిల్పాలున్న ఏకైక పార్క్ ఎక్స్​పీరియం అని నిర్వాహకులు చెప్పారు. 

(6 / 6)

రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా ఎక్స్​పీరియం పార్కు అని నిర్వాహకులు అంటున్నారు. ఈ పార్క్ లో రూ.5 లక్షల నుంచి రూ.కోటి విలువైన శిల్పాలు ఉన్నాయి. చెట్లతో చేసిన అత్యధిక సజీవ శిల్పాలున్న ఏకైక పార్క్ ఎక్స్​పీరియం అని నిర్వాహకులు చెప్పారు. 

(Image Source : Hi Hyderabad X Account)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు