(1 / 7)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదారాబాద్ చేరుకున్నారు. బుధవారం సాయంత్రం దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
(2 / 7)
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపుగా ఐదు నెలల తర్వాత ఆమె హైదరాబాద్కు చేరుకున్నారు.
(3 / 7)
శంషాబాద్ నుంచి భారీ ర్యాలీగా బంజారాహిల్స్ లో తన నివాసానికి చేరుకున్నారు కవిత. ఇంటికి చేరుకున్న కవితకు తల్లి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.
(4 / 7)
తల్లి శోభను ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. శోభమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత కవితను చూసిన కటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.
(5 / 7)
తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు.
(6 / 7)
తాను ఏ తప్పు చేయలేదని, ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైందన్నారు.
(7 / 7)
క్షేత్ర స్థాయిలో మరింత పోరాడుతానని కవిత అన్నారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని కవిత తెలిపారు. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని తెలిపారు.
ఇతర గ్యాలరీలు