Telangana Rice : ఇందూరు పంట.. ఫిలిప్పీన్స్‌‌లో వంట.. తెలంగాణ బియ్యానికి మంచి డిమాండ్-huge rice exports are being made from telangana to the philippines ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Rice : ఇందూరు పంట.. ఫిలిప్పీన్స్‌‌లో వంట.. తెలంగాణ బియ్యానికి మంచి డిమాండ్

Telangana Rice : ఇందూరు పంట.. ఫిలిప్పీన్స్‌‌లో వంట.. తెలంగాణ బియ్యానికి మంచి డిమాండ్

Published Mar 08, 2025 04:04 PM IST Basani Shiva Kumar
Published Mar 08, 2025 04:04 PM IST

  • Telangana Rice : తెలంగాణ రైతులు ప్రాణం పెట్టి పంట పండిస్తారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నారు. మన రైతులు పండించే పంటలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఫిలిప్పీన్స్‌‌‌కు లక్ష టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదిరింది. మన బియ్యంపై ఆ దేశ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ అన్నపూర్ణగా అవతరిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక.. సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వరిసాగు ఊహించని స్థాయిలో పెరిగింది. అందుకు తగ్గట్టు విదేశాల్లో మన బియ్యానికి డిమాండ్ ఉంటోంది. మన రైతులు పండించిన దొడ్డు రకం బియ్యం ఎల్లలు దాటుతోంది. 

(1 / 7)

తెలంగాణ అన్నపూర్ణగా అవతరిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక.. సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వరిసాగు ఊహించని స్థాయిలో పెరిగింది. అందుకు తగ్గట్టు విదేశాల్లో మన బియ్యానికి డిమాండ్ ఉంటోంది. మన రైతులు పండించిన దొడ్డు రకం బియ్యం ఎల్లలు దాటుతోంది. 

(unsplash)

ఫిలిప్పీన్స్‌ దేశానికి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి 10 వేల టన్నుల బియ్యాన్ని ప్రస్తుతం ఎగుమతి చేస్తున్నారు. ఆ దేశ వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి లక్ష టన్నుల బియ్యాన్ని ఈ ఏడాది ఎగుమతి చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. ఆ బాధ్యతలను రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలకు అప్పగించారు. 

(2 / 7)

ఫిలిప్పీన్స్‌ దేశానికి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి 10 వేల టన్నుల బియ్యాన్ని ప్రస్తుతం ఎగుమతి చేస్తున్నారు. ఆ దేశ వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి లక్ష టన్నుల బియ్యాన్ని ఈ ఏడాది ఎగుమతి చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. ఆ బాధ్యతలను రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలకు అప్పగించారు. 

(unsplash)

నిజామాబాద్‌ జిల్లా 7 వేల టన్నులు, కామారెడ్డి జిల్లా నుంచి 3 వేల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. దీంతో పౌరసరఫరాలశాఖ అధికారులు ఎగుమతి బియ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఫిలిప్పీన్స్‌ దేశ ప్రతినిధులు, స్థానిక అధికారులు కలిసి.. ఎగుమతి కోసం సిద్ధం చేసిన బియ్యాన్ని పరిశీలించారు. 

(3 / 7)

నిజామాబాద్‌ జిల్లా 7 వేల టన్నులు, కామారెడ్డి జిల్లా నుంచి 3 వేల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. దీంతో పౌరసరఫరాలశాఖ అధికారులు ఎగుమతి బియ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఫిలిప్పీన్స్‌ దేశ ప్రతినిధులు, స్థానిక అధికారులు కలిసి.. ఎగుమతి కోసం సిద్ధం చేసిన బియ్యాన్ని పరిశీలించారు. 

(unsplash)

ప్రత్యేకంగా మరాడించిన బియ్యాన్ని క్వాలిటీ టెస్ట్‌ మిల్లింగ్‌ చేశారు. ఇక్కడి బియ్యం చూసి ఆ దేశ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు పండించిన దొడ్డు రకం వరిని మిల్లర్లు ప్రత్యేకంగా మరాడిస్తున్నారు. ఆ బియ్యాన్ని ఫిలిప్పీన్స్‌‌కు పంపిస్తున్నారు.

(4 / 7)

ప్రత్యేకంగా మరాడించిన బియ్యాన్ని క్వాలిటీ టెస్ట్‌ మిల్లింగ్‌ చేశారు. ఇక్కడి బియ్యం చూసి ఆ దేశ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు పండించిన దొడ్డు రకం వరిని మిల్లర్లు ప్రత్యేకంగా మరాడిస్తున్నారు. ఆ బియ్యాన్ని ఫిలిప్పీన్స్‌‌కు పంపిస్తున్నారు.

(unsplash)

నిజామాబాద్‌లో 40కి పైగా మిల్లులకు, కామారెడ్డి జిల్లాలో 25 మిల్లులకు మరాడించే బాధ్యతలు అప్పగించారు. కామారెడ్డి జిల్లాలో మిల్లింగ్‌ చేసిన 150 టన్నుల బియ్యాన్ని ఇప్పటికే ఏపీలోని కాకినాడ పోర్టుకు పంపించారు. మిగతా బియ్యాన్ని మిల్లింగ్‌ చేస్తున్నారు. దీని తర్వాత మరిన్ని టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయనున్నారు. 

(5 / 7)

నిజామాబాద్‌లో 40కి పైగా మిల్లులకు, కామారెడ్డి జిల్లాలో 25 మిల్లులకు మరాడించే బాధ్యతలు అప్పగించారు. కామారెడ్డి జిల్లాలో మిల్లింగ్‌ చేసిన 150 టన్నుల బియ్యాన్ని ఇప్పటికే ఏపీలోని కాకినాడ పోర్టుకు పంపించారు. మిగతా బియ్యాన్ని మిల్లింగ్‌ చేస్తున్నారు. దీని తర్వాత మరిన్ని టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయనున్నారు. 

(unsplash)

వే బిల్లులను పౌరసరఫరాల శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు. నిజామాబాద్‌లో మరాడించిన బియ్యాన్ని కూడా కాకినాడ పంపిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌ దేశ ప్రతినిధుల సూచన మేరకు.. దొడ్డు బియ్యాన్ని ఎక్కువగా పాలిష్‌ చేస్తున్నారు. నూక, చెత్త లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

(6 / 7)

వే బిల్లులను పౌరసరఫరాల శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు. నిజామాబాద్‌లో మరాడించిన బియ్యాన్ని కూడా కాకినాడ పంపిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌ దేశ ప్రతినిధుల సూచన మేరకు.. దొడ్డు బియ్యాన్ని ఎక్కువగా పాలిష్‌ చేస్తున్నారు. నూక, చెత్త లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

(unsplash)

మన తెలంగాణ బియ్యానికి ఇతర దేశాల్లో డిమాండ్‌ ఇలాగే ఉంటే.. రైతులు వరి సాగును మరింత విస్తృతం చేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇతర దేశాలతో సంప్రదింపులు జరిపి.. బియ్యం ఎగుమతిని పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. 

(7 / 7)

మన తెలంగాణ బియ్యానికి ఇతర దేశాల్లో డిమాండ్‌ ఇలాగే ఉంటే.. రైతులు వరి సాగును మరింత విస్తృతం చేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇతర దేశాలతో సంప్రదింపులు జరిపి.. బియ్యం ఎగుమతిని పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. 

(unsplash)

ఇతర గ్యాలరీలు