Vemulawada Temple : వేములవాడ రాజన్న క్షేత్రం... భక్తజనసంద్రం-huge devotees rush at vemulawada temple due to saravana masam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vemulawada Temple : వేములవాడ రాజన్న క్షేత్రం... భక్తజనసంద్రం

Vemulawada Temple : వేములవాడ రాజన్న క్షేత్రం... భక్తజనసంద్రం

Published Sep 05, 2023 05:23 PM IST HT Telugu Desk
Published Sep 05, 2023 05:23 PM IST

  • Devotees Rush At Vemulawada Temple :రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం భక్తజన సంద్రంగా మారింది. శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా సోమవారం భారీగా తరలిరాగా.. మంగళవారం భక్తులు రద్దీ ఎక్కువగానే ఉంది. 

శ్రావణ మాసం ఆరంభం నుంచే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ తరుణంలో అంచనాలకు మించి భక్తులు దర్శనానికి తరలివస్తుండడంతో అధికారులు భక్తుల సౌకర్యార్థమై శీఘ్ర లఘుదర్శనం ఏర్పాటు చేశారు. 

(1 / 5)

శ్రావణ మాసం ఆరంభం నుంచే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ తరుణంలో అంచనాలకు మించి భక్తులు దర్శనానికి తరలివస్తుండడంతో అధికారులు భక్తుల సౌకర్యార్థమై శీఘ్ర లఘుదర్శనం ఏర్పాటు చేశారు. 

గర్భగుడిలోకి అర్చకులు మినహయించి వీఐపీ,స్పెషల్ దర్శనాలు,ప్రత్యేక పూజలను రద్దు చేశారు. గత మూడు రోజుల్లోనే సుమారు లక్షా ఇరవై వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నట్టు అధికారులు అంచనాలు వేస్తున్నారు.

(2 / 5)

గర్భగుడిలోకి అర్చకులు మినహయించి వీఐపీ,స్పెషల్ దర్శనాలు,ప్రత్యేక పూజలను రద్దు చేశారు. గత మూడు రోజుల్లోనే సుమారు లక్షా ఇరవై వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నట్టు అధికారులు అంచనాలు వేస్తున్నారు.

ఆదివారం సెలవు దినం కావడంతో పాటు శ్రావణ సోమవారం, మంగళవారం రోజున పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి నిత్య కళ్యాణం,కుంకుమపూజ,స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు తీర్చడానికి సుమారు మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతోంది.

(3 / 5)

ఆదివారం సెలవు దినం కావడంతో పాటు శ్రావణ సోమవారం, మంగళవారం రోజున పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి నిత్య కళ్యాణం,కుంకుమపూజ,స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు తీర్చడానికి సుమారు మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతోంది.

సర్వదర్శనంలో స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు ఆరు గంటల నుండి పదకొండు గంటల సమయం పడుతోంది. దేవాలయ ప్రాంగణం ఎటు చూసినా జనసంద్రంగా కనబడుతుంది.

(4 / 5)

సర్వదర్శనంలో స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు ఆరు గంటల నుండి పదకొండు గంటల సమయం పడుతోంది. దేవాలయ ప్రాంగణం ఎటు చూసినా జనసంద్రంగా కనబడుతుంది.

రాజరాజేశ్వర స్వామి దేవాలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన భీమేశ్వర,నగరేశ్వర ఆలయాలతో పాట బద్దిపోచమ్మ దేవాలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించుకోవాడనికి సుమారు రెండు కిలోమీటర్లకు పైగా భక్తులు బారులు తీరారు. శుభ ముహుర్తాలు ముగుస్తున్న తరుణంలో ముహుర్తాల కంటే ముందే మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తుడడంతో రాజన్న క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడుతోంది.

(5 / 5)

రాజరాజేశ్వర స్వామి దేవాలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన భీమేశ్వర,నగరేశ్వర ఆలయాలతో పాట బద్దిపోచమ్మ దేవాలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించుకోవాడనికి సుమారు రెండు కిలోమీటర్లకు పైగా భక్తులు బారులు తీరారు. శుభ ముహుర్తాలు ముగుస్తున్న తరుణంలో ముహుర్తాల కంటే ముందే మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తుడడంతో రాజన్న క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడుతోంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు