(1 / 7)
ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కొత్త కార్డులతో పాటు సభ్యుల పేర్లు చేర్చటం వంటి వాటి కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.
(2 / 7)
మే నుంచి ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాలలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలోనే ఏటీఎం కార్డు సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది.
(3 / 7)
(4 / 7)
కొత్త కార్డుల జారీతో పాటు మార్పులు, చేర్పుల వివరాల నమోదుకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సర్కార్ మరో అప్డేట్ ఇచ్చింది. రేషన్ కార్డులోని సభ్యుల వివరాలను తెలుసుకునేందుకు మరో ఆప్షన్ తీసుకువచ్చింది.
(5 / 7)
రేషన్ కార్డులు https://aepos.ap.gov.in/SRC_Trans_Int.jsp వెబ్ సైట్ లోకి వెళ్లి కార్డుపై ఉన్న సభ్యుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని సూచించింది. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత రేషన్ కార్డు నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేస్తే రేషన్ కార్డులోని సభ్యుల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
(6 / 7)
మరోవైపు బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. బోగస్ రేషన్ కార్డులను ఏరివేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తు్న్నట్లు తెలుస్తోంది.
(7 / 7)
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సాయంతో రేషన్ కార్డుల సర్వే చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలిసింది. అనర్హులను గుర్తించేందుకు ఈ సర్వే చేయనున్నారు. దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇతర గ్యాలరీలు