(1 / 7)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్ ప్రారంభమైంది. ఏప్రిల్ 14వ తేదీనే భూ భారతి చట్టం అమల్లోకి రావటంతో పాటు సేవలు కూడా ప్రారంభమయ్యాయి.
(2 / 7)
పైలట్ ప్రాజెక్ట్ గా ఈ పోర్టల్ ను ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో అమలు చేస్తున్నారు.
వెంకటాపూర్ (ములుగు), నేలకొండపల్లి (ఖమ్మం) మండలం, మద్దూరు (నారాయణపేట జిల్లా), లింగంపేట (కామారెడ్డి) మండలాలను ఎంపిక చేశారు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఏప్రిల్ 14 నుంచి ఈ 4 మండలాల్లో భూ భారతి పోర్టల్ ఆధారంగానే సేవలు కొనసాగుతున్నాయి.
(3 / 7)
భూ భారతి పోర్టల్ లో లావాదేవీ సేవలతో పాటు సమాచార సేవలు ఉన్నాయి. ఇందులో ఒకటిగా రికార్డుల సవరణ కూడా ఒకటిగా ఉంది. దీని ఆధారంగా భూ రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునే వీలు ఉంటుంది.
(4 / 7)
రైతుకు సంబంధించిన భూరికార్డుల్లో వివరాలు తప్పుగా ఉంటే భూ భారతి ( https://bhubharati.telangana.gov.in/ ) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది.
(5 / 7)
దరఖాస్తుదారిడి పాస్ పుస్తకంతో పాటు పహాణీ, టైటిల్ డీడ్, 1బీతో పాటు ప్రమాణపత్రాలన్ని సమర్పించాలి. ఇంకా ఇతర ఆధారాలు ఏమైనా ఉంటే చూపాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును పరిశీలించిన తర్వాత… అలాంటి భూమితో సంబంధం ఉన్న వారికి అధికారులు నోటీసులు ఇస్తారు. ఎవరైనా వారంలో అభ్యంతరాలు రాతపూర్వకంగా అందించాల్సి ఉంటుంది.
(6 / 7)
అభ్యంతరాల గడువు పూర్తి అయితే వెంటనే నిర్ణయం తీసుకుంటారు. సవరణ ప్రాసెస్ పూర్తి చేసేస్తారు. ఇక అభ్యంతరాలు వస్తే 7 రోజుల తరువాత విచారణ చేపడుతారు. 60 రోజుల్లో పరిష్కరిస్తారు.
ఇతర గ్యాలరీలు