తెలంగాణలో 'భూ భారతి' సేవలు - రికార్డుల్లో తప్పుల సవరణకు ఛాన్స్..! ప్రాసెస్ ఇలా-how to correct errors in land records as per the telangana bhu bharati ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తెలంగాణలో 'భూ భారతి' సేవలు - రికార్డుల్లో తప్పుల సవరణకు ఛాన్స్..! ప్రాసెస్ ఇలా

తెలంగాణలో 'భూ భారతి' సేవలు - రికార్డుల్లో తప్పుల సవరణకు ఛాన్స్..! ప్రాసెస్ ఇలా

Published Apr 18, 2025 04:52 PM IST Maheshwaram Mahendra Chary
Published Apr 18, 2025 04:52 PM IST

  • రాష్ట్రంలో భూ భారతి చట్టం అమల్లో వచ్చేసింది. దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం భూ భారతి పోర్టల్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలోనే అన్ని మండలాల్లోనూ ఈ సేవలు ప్రారంభమవుతాయి. అయితే భూ రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే భూ భారతి ద్వారా సవరించుకోవచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి….

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్‌ ప్రారంభమైంది. ఏప్రిల్ 14వ తేదీనే భూ భారతి చట్టం అమల్లోకి రావటంతో పాటు సేవలు కూడా ప్రారంభమయ్యాయి.

(1 / 7)

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్‌ ప్రారంభమైంది. ఏప్రిల్ 14వ తేదీనే భూ భారతి చట్టం అమల్లోకి రావటంతో పాటు సేవలు కూడా ప్రారంభమయ్యాయి.

పైలట్ ప్రాజెక్ట్ గా ఈ పోర్టల్ ను ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో అమలు చేస్తున్నారు.వెంకటాపూర్‌ (ములుగు), నేలకొండపల్లి (ఖమ్మం) మండలం, మద్దూరు (నారాయణపేట జిల్లా), లింగంపేట (కామారెడ్డి) మండలాలను ఎంపిక చేశారు. జూన్‌ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఏప్రిల్ 14 నుంచి ఈ 4 మండలాల్లో భూ భారతి పోర్టల్ ఆధారంగానే సేవలు కొనసాగుతున్నాయి.

(2 / 7)

పైలట్ ప్రాజెక్ట్ గా ఈ పోర్టల్ ను ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో అమలు చేస్తున్నారు.

వెంకటాపూర్‌ (ములుగు), నేలకొండపల్లి (ఖమ్మం) మండలం, మద్దూరు (నారాయణపేట జిల్లా), లింగంపేట (కామారెడ్డి) మండలాలను ఎంపిక చేశారు. జూన్‌ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఏప్రిల్ 14 నుంచి ఈ 4 మండలాల్లో భూ భారతి పోర్టల్ ఆధారంగానే సేవలు కొనసాగుతున్నాయి.

భూ భారతి పోర్టల్ లో లావాదేవీ సేవలతో పాటు సమాచార సేవలు ఉన్నాయి. ఇందులో ఒకటిగా రికార్డుల సవరణ కూడా ఒకటిగా ఉంది. దీని ఆధారంగా భూ రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునే వీలు ఉంటుంది.

(3 / 7)

భూ భారతి పోర్టల్ లో లావాదేవీ సేవలతో పాటు సమాచార సేవలు ఉన్నాయి. ఇందులో ఒకటిగా రికార్డుల సవరణ కూడా ఒకటిగా ఉంది. దీని ఆధారంగా భూ రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునే వీలు ఉంటుంది.

రైతుకు సంబంధించిన భూరికార్డుల్లో వివరాలు తప్పుగా ఉంటే భూ భారతి ( https://bhubharati.telangana.gov.in/ ) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది.

(4 / 7)

రైతుకు సంబంధించిన భూరికార్డుల్లో వివరాలు తప్పుగా ఉంటే భూ భారతి ( https://bhubharati.telangana.gov.in/ ) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది.

దరఖాస్తుదారిడి పాస్ పుస్తకంతో పాటు పహాణీ, టైటిల్ డీడ్, 1బీతో పాటు ప్రమాణపత్రాలన్ని సమర్పించాలి. ఇంకా ఇతర ఆధారాలు ఏమైనా ఉంటే చూపాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును పరిశీలించిన తర్వాత… అలాంటి భూమితో సంబంధం ఉన్న వారికి అధికారులు నోటీసులు ఇస్తారు. ఎవరైనా వారంలో అభ్యంతరాలు రాతపూర్వకంగా అందించాల్సి ఉంటుంది.

(5 / 7)

దరఖాస్తుదారిడి పాస్ పుస్తకంతో పాటు పహాణీ, టైటిల్ డీడ్, 1బీతో పాటు ప్రమాణపత్రాలన్ని సమర్పించాలి. ఇంకా ఇతర ఆధారాలు ఏమైనా ఉంటే చూపాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును పరిశీలించిన తర్వాత… అలాంటి భూమితో సంబంధం ఉన్న వారికి అధికారులు నోటీసులు ఇస్తారు. ఎవరైనా వారంలో అభ్యంతరాలు రాతపూర్వకంగా అందించాల్సి ఉంటుంది.

అభ్యంతరాల గడువు పూర్తి అయితే వెంటనే నిర్ణయం తీసుకుంటారు. సవరణ ప్రాసెస్ పూర్తి చేసేస్తారు.  ఇక అభ్యంతరాలు వస్తే 7 రోజుల తరువాత విచారణ చేపడుతారు. 60 రోజుల్లో పరిష్కరిస్తారు.

(6 / 7)

అభ్యంతరాల గడువు పూర్తి అయితే వెంటనే నిర్ణయం తీసుకుంటారు. సవరణ ప్రాసెస్ పూర్తి చేసేస్తారు. ఇక అభ్యంతరాలు వస్తే 7 రోజుల తరువాత విచారణ చేపడుతారు. 60 రోజుల్లో పరిష్కరిస్తారు.

సవరణకు సంంబధించి ఇచ్చే ఉత్తర్వుల విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎమ్మార్వోకు అప్పీల్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆర్డీవో… ఆపై స్థాయిలో జిల్లా కలెక్టర్ కు కూడా అప్పీల్ చేసుకునే వీలు ఉంటుంది.  అన్ని రికార్డులు సమర్పిస్తేనే…. సవరణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.

(7 / 7)

సవరణకు సంంబధించి ఇచ్చే ఉత్తర్వుల విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎమ్మార్వోకు అప్పీల్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆర్డీవో… ఆపై స్థాయిలో జిల్లా కలెక్టర్ కు కూడా అప్పీల్ చేసుకునే వీలు ఉంటుంది. అన్ని రికార్డులు సమర్పిస్తేనే…. సవరణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు