(1 / 8)
ఏపీలో తల్లికి వందనం స్కీమ్ డబ్బులు జమవుతున్నాయి. అర్హులుగా గుర్తించిన విద్యార్థుల తల్లుల ఖాతాలో వీటిని జమ చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద మొత్తం రూ. 15 వేలు ఇస్తుండగా… వీటిలో రూ. 13 వేలు తల్లి ఖాతాలో జమవుతాయి. మరో రూ. 2 వేలు జిల్లా కలెక్టర్ ఖాతాలోకి వెళ్తాయి.
(2 / 8)
తల్లికి వందనం పథకం కింద ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే పిల్లలకు రూ. 13 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. మరో రూ. 2 వేలను స్కూళ్ల అభివృద్ధికి కేటాయిస్తోంది. అయితే ఈ స్కీమ్ కు సంబంధించిన స్టేటస్ ను మీ మొబైల్ ఫోన్ ద్వారా కూడా చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
(3 / 8)
ముందుగా మీ మొబైల్ ఫోన్ లో https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP లింక్ ను ఓపెన్ చేయాలి. ఇక్కడ హోం పేజీలో NBM Application Status అని కనిపిస్తుంది. దీని కిందనే స్కీమ్ ఆప్షన్ లో తల్లికి వందనం ఎంపిక చేయాలి.
(4 / 8)
ఆ తర్వాత విద్యా సంవత్సరం (2025- 26) ఎంచుకోవాలి. ఆపై తల్లి ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. క్యాప్చా కోడ్ ను ఎంట్రీ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. లింకింగ్ ఉన్న నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ ను ఎంట్రీ చేస్తే….మీ అప్లికేషన్ స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.
(5 / 8)
ముందుగా ప్రాథమిక వివరాలు కనిపిస్తాయి. ఇందులో జిల్లా, మండలం, క్లస్టర్ పేరు, లబ్ధిదారు పేరు వంటి వివరాలను డిస్ ప్లే అవుతాయి. ఆ తర్వాత మీ అప్లికేషన్ వివరాలను కనిపిస్తాయి.
(6 / 8)
ఇక చివరల్లో పేమెంట్ వివరాలు కనిపిస్తాయి. మీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయా లేదా అనేది కనిపిస్తుంది. జమ కాకుండా ఉంటే కూడా ఆ వివరాలు డిస్ ప్లే అవుతాయి.
(7 / 8)
మరోవైపు గ్రామ సచివాలయాల్లో తల్లికి వందనం స్కీమ్ అర్హులు, అనర్హుల జాబితాల ప్రదర్శిస్తున్నారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే జూన్ 20వ తేదీ వరకు ఫిర్యాదులు చేసుకోవచ్చు. ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత వాటిని పునఃపరిశీలిస్తారు. అర్హులైన వారిని గుర్తిస్తారు. మరో జాబితాను సిద్ధం చేస్తారు.
(8 / 8)
జూన్ 21 నుంచి 28 తేదీల మధ్య ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.గ్రీవెన్స్ లో పరిశీలన పూర్తి అయిన తర్వాత… అర్హులను గుర్తిస్తారు. ఈ అదనపు జాబితాను జూన్ 30వ తేదీన విడుదల చేస్తారు. వీరికి జూలై 5వ తేదీన నిధులను జమ చేస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ స్కీమ్ కింద డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఇతర గ్యాలరీలు