ఏపీ టెన్త్ 2025 ఫలితాలు : షార్ట్ మెమోలపై అప్డేట్ వచ్చేసింది - ఇవిగో వివరాలు-here are the updates on ap ssc results 2025 short memos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏపీ టెన్త్ 2025 ఫలితాలు : షార్ట్ మెమోలపై అప్డేట్ వచ్చేసింది - ఇవిగో వివరాలు

ఏపీ టెన్త్ 2025 ఫలితాలు : షార్ట్ మెమోలపై అప్డేట్ వచ్చేసింది - ఇవిగో వివరాలు

Published Apr 23, 2025 12:01 PM IST Maheshwaram Mahendra Chary
Published Apr 23, 2025 12:01 PM IST

  • ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్. అయితే విద్యార్థుల మెమోలకు సంబంధించి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నాలుగు రోజుల్లో షార్ట్ మెమోలను అందుబాటులో ఉంచుతామని ప్రకటన చేసింది. వీటీని ఏపీ టెన్త్ బోర్డు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

ఏపీ పదో తరగతి 2025 ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్ ను ప్రకటించారు. ఈసారి జరిగిన పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు.

(1 / 7)

ఏపీ పదో తరగతి 2025 ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్ ను ప్రకటించారు. ఈసారి జరిగిన పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీ పదో తరగతి ఫలితాల్లో రాష్టవ్యాప్తంగా 81.14 శాతం నమోదైనట్లు విద్యాశాఖ వెల్లడించింది.  బాలుర ఉత్తీర్ణత శాతం 78.31గా ఉండగా… బాలికల ఉత్తీర్ణత శాతం 84.09గా ఉంది. బాలురతో పోల్చితే బాలికల ఉత్తీర్ణత 5.78 శాతం ఎక్కువగా ఉంది.

(2 / 7)

ఏపీ పదో తరగతి ఫలితాల్లో రాష్టవ్యాప్తంగా 81.14 శాతం నమోదైనట్లు విద్యాశాఖ వెల్లడించింది. బాలుర ఉత్తీర్ణత శాతం 78.31గా ఉండగా… బాలికల ఉత్తీర్ణత శాతం 84.09గా ఉంది. బాలురతో పోల్చితే బాలికల ఉత్తీర్ణత 5.78 శాతం ఎక్కువగా ఉంది.

రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19 పాఠశాలల్లో సున్నా శాతం నమోదైనట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఏపీ టెన్త్ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93. 90 శాతంతో టాప్ ప్లేస్ లో నిలిచింది. 47.67 శాతం ఉత్తీర్ణతతో అల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది.

(3 / 7)

రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19 పాఠశాలల్లో సున్నా శాతం నమోదైనట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఏపీ టెన్త్ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93. 90 శాతంతో టాప్ ప్లేస్ లో నిలిచింది. 47.67 శాతం ఉత్తీర్ణతతో అల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది.

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థుల షార్ట్ మెమోలకు సంబంధించి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఫలితాల విడుదలైన నాలుగు రోజుల్లోపు షార్ట్ మెమోలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అంటే ఏప్రిల్ 27 నుంచి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

(4 / 7)

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థుల షార్ట్ మెమోలకు సంబంధించి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఫలితాల విడుదలైన నాలుగు రోజుల్లోపు షార్ట్ మెమోలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అంటే ఏప్రిల్ 27 నుంచి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఏపీ టెన్త్ షార్ట్ మెమోలను http://bseaps.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ తెలిపింది. వీటి ఆధారంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలను పొందవచ్చని సూచించింది.

(5 / 7)

ఏపీ టెన్త్ షార్ట్ మెమోలను http://bseaps.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ తెలిపింది. వీటి ఆధారంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలను పొందవచ్చని సూచించింది.

పాఠశాలల వారీగా విద్యార్థుల మెమోలను ప్రిన్సిపాల్ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్కూళ్లకు వెళ్లలేని విద్యార్థులు https://results.bse.ap.gov.in  వెబ్ సైట్ లోకి వెళ్లి మెమోలను పొందే అవకాశం ఉంటుందని విద్యాశాఖ వివరించింది. ఫైనల్ మెమోలను పాఠశాలలకు పంపుతామని పేర్కొంది.

(6 / 7)

పాఠశాలల వారీగా విద్యార్థుల మెమోలను ప్రిన్సిపాల్ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్కూళ్లకు వెళ్లలేని విద్యార్థులు https://results.bse.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి మెమోలను పొందే అవకాశం ఉంటుందని విద్యాశాఖ వివరించింది. ఫైనల్ మెమోలను పాఠశాలలకు పంపుతామని పేర్కొంది.

ఏపీ పదో తరగతి ఫలితాలను హిందుస్తామ్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లింక్ https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result ద్వారా వేగంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా https://results.bse.ap.gov.in/RES25/ లింక్ పై క్లిక్ చేసి కూడా ఫలితాలను పొందవచ్చు.

(7 / 7)

ఏపీ పదో తరగతి ఫలితాలను హిందుస్తామ్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లింక్ https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result ద్వారా వేగంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా https://results.bse.ap.gov.in/RES25/ లింక్ పై క్లిక్ చేసి కూడా ఫలితాలను పొందవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు