AP Half Day Schools 2025 : ఏపీలో ఈసారి కాస్త ముందుగానే 'ఒంటిపూట బడులు'….! ఇవిగో అప్డేట్స్-half day schools are likely to start in ap in the month of march 2025 latest updates here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Half Day Schools 2025 : ఏపీలో ఈసారి కాస్త ముందుగానే 'ఒంటిపూట బడులు'….! ఇవిగో అప్డేట్స్

AP Half Day Schools 2025 : ఏపీలో ఈసారి కాస్త ముందుగానే 'ఒంటిపూట బడులు'….! ఇవిగో అప్డేట్స్

Published Mar 01, 2025 06:03 AM IST Maheshwaram Mahendra Chary
Published Mar 01, 2025 06:03 AM IST

  • Half Day Schools in Andhrapradesh 2025 : ఫిబ్రవరి మొదటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్కూల్ పిల్లలు ఇబ్బంది పడకుండా కాస్త ముందుగానే ఒంటిపూట బడులు నిర్వహించే దిశగా ఏపీ విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. గతేడాది మాదిరి కాకుండా… ఫిబ్రవరి మొదటి వారం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఉదయం దాటితే బయటికి వెళ్లాలంటే.. జనం జంకుతున్నారు.

(1 / 7)

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. గతేడాది మాదిరి కాకుండా… ఫిబ్రవరి మొదటి వారం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఉదయం దాటితే బయటికి వెళ్లాలంటే.. జనం జంకుతున్నారు.

(Twitter)

తెలంగాణతో పోల్చితే ఏపీలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. చాలా జిల్లాల్లో 35 డిగ్రీలకుపైగా సెంటిగ్రేడ్ ల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మార్చి రావటంతో… పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంది. 

(2 / 7)

తెలంగాణతో పోల్చితే ఏపీలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. చాలా జిల్లాల్లో 35 డిగ్రీలకుపైగా సెంటిగ్రేడ్ ల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మార్చి రావటంతో… పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంది. 

(image source istock.com)

ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఏపీ విద్యాశాఖ ఒంటిపూట బడులపై కసరత్తు చేసే పనిలో పడింది. గతేడాదితో పోల్చితే ఈసారి కాస్త ముందుగానే ఒంటి పూట బడులను ప్రారంభించాలని యోచిస్తోంది.

(3 / 7)

ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఏపీ విద్యాశాఖ ఒంటిపూట బడులపై కసరత్తు చేసే పనిలో పడింది. గతేడాదితో పోల్చితే ఈసారి కాస్త ముందుగానే ఒంటి పూట బడులను ప్రారంభించాలని యోచిస్తోంది.

(image source istock.com)

గతేడాదిలో మార్చి 18వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి మార్చి 15వ తేదీ నుంచే ప్రారంభించే అవకాశం ఉంది.  ఇందుకు సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. 

(4 / 7)

గతేడాదిలో మార్చి 18వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి మార్చి 15వ తేదీ నుంచే ప్రారంభించే అవకాశం ఉంది.  ఇందుకు సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. 

(image source istock.com)

ఎండల తీవ్ర ఎక్కువగా ఉండటంతో పాటు మార్చిలో మరింత పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వీలైతే మార్చి మొదటి వారం నుంచే  ప్రారంభించే అవకాశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

(5 / 7)

ఎండల తీవ్ర ఎక్కువగా ఉండటంతో పాటు మార్చిలో మరింత పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వీలైతే మార్చి మొదటి వారం నుంచే  ప్రారంభించే అవకాశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

ఒంటిపూట బడులపై ప్రకటన వస్తే…. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ప్రస్తుత సమయం కాకుండా… ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకే తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఒంటిపూట బడుల సమయంలో పాఠశాలల్లో ప్రత్యేక వసతులు కల్పించేలా సర్కార్ చర్యలు చేపడుతోంది..

(6 / 7)

ఒంటిపూట బడులపై ప్రకటన వస్తే…. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ప్రస్తుత సమయం కాకుండా… ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకే తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఒంటిపూట బడుల సమయంలో పాఠశాలల్లో ప్రత్యేక వసతులు కల్పించేలా సర్కార్ చర్యలు చేపడుతోంది..

(image source istock.com)

ఇక ఏపీలో మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు సిద్ధం చేసింది. మార్చి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 17 -ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19-సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21- ఇంగ్లీష్, మార్చి 24 -గణితం, మార్చి 26- ఫిజిక్స్, మార్చి 28 - బయోలజీ, మార్చి 31 - సోషల్ స్టడీస్ పరీక్ష ఉంటుంది.

(7 / 7)

ఇక ఏపీలో మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు సిద్ధం చేసింది. మార్చి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 

మార్చి 17 -ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19-సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21- ఇంగ్లీష్, మార్చి 24 -గణితం, మార్చి 26- ఫిజిక్స్, మార్చి 28 - బయోలజీ, మార్చి 31 - సోషల్ స్టడీస్ పరీక్ష ఉంటుంది.

(image source DD Andhra)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు