(1 / 5)
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. 2022లో ఐపీఎల్ లో అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే ఛాంపియన్ గా నిలిచిన ఆ టీమ్.. ఈ సారి కూడా టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. 8 మ్యాచ్ ల్లో 6 విజయాలతో దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంది. ఆ టీమ్ ఇప్పటివరకూ పంజాబ్, లక్నో చేతిలో మాత్రమే ఓడింది.
(AP)(2 / 5)
బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ అద్భుతమైన నిలకడ కొనసాగిస్తున్నాడు. 8 ఇన్నింగ్స్ ల్లో 5 హాఫ్ సెంచరీలు చేశాడు. 52.12 సగటుతో 417 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల వీరుల్లో అగ్రస్థానంతో ఆరెంజ్ క్యాప్ తో కొనసాగుతున్నాడు.
(Hindustan Times)(3 / 5)
డేంజరస్ బ్యాటర్ బట్లర్ కూడా సంచలన ఫామ్ కొనసాగిస్తుండటం గుజరాత్ కు కలిసొస్తోంది. ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగుతున్న అతను 8 ఇన్నింగ్స్ ల్లో 356 పరుగులు చేశాడు. 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
(Surjeet)(4 / 5)
బౌలింగ్ లోనూ గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం మామూలుగా లేదు. ఆ టీమ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వికెట్ల వేటలో దూసుకెళ్తున్నాడు. 8 ఇన్నింగ్స్ ల్లో 16 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.
(REUTERS)ఇతర గ్యాలరీలు