(1 / 6)
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో రాజధాని నగర పరిసరాలను అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) అతిథులను విశేషంగా ఆకర్షించేలా వినూత్నమైన మొక్కలతో రహదార్లు, హెలీప్యాడ్, వేదికకు వచ్చే మార్గాలను ముస్తాబు చేస్తోంది. ఏడీసీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్థసారథి ఆదేశాలతో హార్టికల్చర్ విభాగం రహదారులను సుందరంగా ముస్తాబు చేస్తోంది.
(2 / 6)
ఇప్పటికే N9 రోడ్డు ప్రవేశద్వారాన్ని ఖర్జూర మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. వాటి మధ్యస్థానంలో గడిచౌడి పసుపు పూల మొక్కలను నాటారు.
(3 / 6)
సభా వేదిక పాయింట్ వద్ద N9 రోడ్డును పచ్చిక బౌగెన్విల్లే, ప్లుమేరియా పుష్పించే మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు.
(4 / 6)
అమరావతి ప్రధాన అనుసంధాన రహదారి సీడ్యాక్సెస్ రోడ్డును పచ్చిక, గులాబీ రంగు లాగర్స్ట్రోమియా మొక్కలతో అలంకరించారు.
(5 / 6)
రాష్ట్ర సచివాలయ ప్రవేశ ద్వారం పచ్చిక, ఫికస్ పోండా, మాల్ఫిజియా కోన్లు, డ్రెస్సినియా మహాత్మా, ఖర్జూరపు చెట్లతో అందంగా అలంకరించబడింది.
ఇతర గ్యాలరీలు