(1 / 13)
ఏపీలో కనీస ప్రీమియంతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్గా, గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్గా ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండు యూనిట్లకు త్వరలో టెండర్లు పిలవనున్నారు.
(2 / 13)
ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా ఏడాదికి రూ.25 లక్షల విలువైన చికిత్సలను ఉచితంగా ప్రస్తుతం అందిస్తున్నారు. కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి, ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని అందించే ప్రతిపాదనలు చేశారు.
(3 / 13)
ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న రూ.25 లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు అలాగే కొనసాగుతాయి. ఏడాదికి రూ.రెండున్నర లక్షల విలువైన వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండరు పిలుస్తారు. దానికి మించి చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు భరిస్తుంది. దీనిని 'హైబ్రిడ్’' విధానంగా చెబుతున్నారు.
(4 / 13)
ఏపీలో ఆరోగ్యశ్రీలో ఏడాదికి రూ.25 లక్షల విలువైన చికిత్సలను ఉచి తంగా ప్రస్తుతం అందిస్తున్నారు. కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి, ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తారు. ప్రధానంగా పట్టణ ప్రాంత ప్రజలకు, పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వాల నుంచి ప్రస్తుతం ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదు. ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు చేశారు. ప్రతి కుటుంబానికి ఇపు వున్న రూ.25 లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు అలాగే కొనసాగుతాయి.
(5 / 13)
ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారికి ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ పరిధిలో 1.48 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 8.5 లక్షల మంది ఉన్నారు. బీమా పథకం కింద ఏడాదికి ఒక్కో ఉద్యోగి, పెన్షనర్ సుమారు రూ.7వేల వరకు చెల్లిస్తున్నారు. జర్నలిస్టులు కూడా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్లో ప్రీమియం చెల్లిస్తున్నారు. ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వారికి మినహాయించి మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింపచేసేందుకు వీలుగా ప్రతిపాదించారు.
(6 / 13)
ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల్లోపు వ్యయమయ్యే చికిత్సలు పొందేవారి సంఖ్య 97% వరక ఉంది.ముఖ్యమంత్రి స్థాయిలో జరిగే సమావేశం తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి బీమా విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పించేలా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చిస్తారు.
(7 / 13)
ఏపీలోని రెండు ప్రాంతాలకు కలిపి ఒక టెండరు పిలుస్తారు. తక్కువ మొత్తాన్ని కోట్ చేసి ఎల్ 1 గా ప్రైవేట్ కంపెనీ వస్తే అదే ధరకు సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ సంస్ధను ఆహ్వానిస్తారు. దీనికి ప్రభుత్వ రంగ సంస్థ ఆమోదం తెలిపితే మరో యూనిట్ బాధ్యత అప్పగిస్తారు. ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థనే ఎల్ 1 గా నిలుస్తే రెండు ఏరియాల్లో బీమా నిర్వహణ బాధ్యతను వారికే అప్ప గిస్తారు.
(8 / 13)
ప్రస్తుతం ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా రోగి చికిత్సకు అనుమతి లభించడానికి 24 గంటల వరకు సమయం పడుతోంది. బీమా విధానంలో 6గంటల్లోనే చికిత్స ప్రారంభించడానికి అనుమతి లభిస్తుంది. చికిత్సకు ఆమోదం తెలిపేందుకు బీమా సంస్థ నిరాకరిస్తే అప్పీలు చేసుకునే వెసులు బాటు కల్పిస్తారు.ఈ విధానంలో ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉండేలా నిబంధనలు ఉంటాయి. ఎంపికచేసిన బీమా కంపెనీ మూడేళ్ల పాటు బీమా సేవలు అందించాలి. ప్రతి ఏడాది పనితీరును సమీక్షిస్తారు.
(9 / 13)
ప్రస్తుతం ఆరోగ్య బీమా అందని కుటుంబాల్లోని వారికి న ప్రభుత్వం చెల్లించా ల్సిన ప్రీమియం కనీసం రూ.2,500 వరకు ఉండొచ్చని అంచనా. జాతీయ స్థాయిలో పిలిచే టెండర్ల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ బీమా కంపెనీలు పోటీ పడతాయి. తమిళనాడు, ఝార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బీమా సంస్థల ద్వారా అక్కడి వారికి వైద్య సేవలు అందుతున్నాయి. వైద్య సేవల పరిమితి, టాప్ అప్ సదుపాయం కూడా కల్పించే అవకాశం ఉంది.
(10 / 13)
ప్రభుత్వ ఆరోగ్య బీమా సంస్థలకు ప్రతి మూడు నెలలకొకసారి ప్రభుత్వం ముందుగానే చెల్లింపులు చేస్తారు. దీనివల్ల బిల్లుల చెల్లింపుల సమస్యలు ఉండదు.
రోగులకు అందించిన చికిత్స వివరాలు అందిన తర్వాత బీమా సంస్థలు సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు చేసేలా నిర్దేశిత గడువును ముందే నిర్ణయిస్తారు.
(11 / 13)
ప్రస్తుతం ఆరోగ్య శ్రీ ద్వారా అందించే వైద్య సేవల్లో 30 రకాల స్పెషాల్టీలతో కలిపి 3,257 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) కింద 1,949 రకాల చికిత్సలూ ఇందులో ఉన్నాయి.
(12 / 13)
అందరికీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం బీమా పథకానికి ప్రణాళికలు రచిస్తోంది.
ఇతర గ్యాలరీలు