Jagitial Ganesh: జగిత్యాల జిల్లా గణేషులకు జియో ట్యాగింగ్ టెక్నాలజీ.. ఒక్క క్లిక్ చేస్తే చాలు!-geotagging technology applied to ganesh mandapam in jagitial district sp ashok kumar explains geotagging uses ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jagitial Ganesh: జగిత్యాల జిల్లా గణేషులకు జియో ట్యాగింగ్ టెక్నాలజీ.. ఒక్క క్లిక్ చేస్తే చాలు!

Jagitial Ganesh: జగిత్యాల జిల్లా గణేషులకు జియో ట్యాగింగ్ టెక్నాలజీ.. ఒక్క క్లిక్ చేస్తే చాలు!

Published Sep 10, 2024 04:17 PM IST Sanjiv Kumar
Published Sep 10, 2024 04:17 PM IST

Geotagging To Ganesh Mandapam In Jagitial District: జగిత్యాల జిల్లాలో ఏర్పాటైన 2791 గణేష్ విగ్రహ మండపాలకు జియో ట్యాగింగ్ వంటి నూతన సాంకేతికతను వాడుతున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఒక్క క్లిక్‌తో మండపాల సమచారం తెలుసుకుని అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

జగిత్యాల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో వినాయకుడి ఉత్సవాలు జరిగేలా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.  

(1 / 8)

జగిత్యాల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో వినాయకుడి ఉత్సవాలు జరిగేలా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. 
 

గణేష్ మండపాల అనుమతులను ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే సూచించిన జిల్లా పోలీసులు అందుకు అనుగుణంగా ప్రతి మండపానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో తెలుసుకునేలా టెక్నాలజీ జియో ట్యాగింగ్‌ను వాడుతున్నారు. 

(2 / 8)

గణేష్ మండపాల అనుమతులను ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే సూచించిన జిల్లా పోలీసులు అందుకు అనుగుణంగా ప్రతి మండపానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో తెలుసుకునేలా టెక్నాలజీ జియో ట్యాగింగ్‌ను వాడుతున్నారు. 

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా  ఈ సంవత్సరం సుమారు 2791  వరకు వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. వీటన్నింటికి ఇప్పటికే జియో ట్యాగింగ్ చేశారు. ఇలా జియో ట్యాగింగ్ చేసిన మండపాలను క్లిక్ చేస్తే మండపానికి సంబందించిన పూర్తి వివరాలు కనిపించేలా చర్యలు చేపట్టారు. 

(3 / 8)

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా  ఈ సంవత్సరం సుమారు 2791  వరకు వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. వీటన్నింటికి ఇప్పటికే జియో ట్యాగింగ్ చేశారు. ఇలా జియో ట్యాగింగ్ చేసిన మండపాలను క్లిక్ చేస్తే మండపానికి సంబందించిన పూర్తి వివరాలు కనిపించేలా చర్యలు చేపట్టారు.
 

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  సూచించారు. 

(4 / 8)

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  సూచించారు. 

మండపాల వద్దకు ఎలా వెళ్లాలి, ఏదైనా అనుచిత సంఘటనలు జరిగినప్పుడు త్వరగా చేరుకునే విధంగా గూగుల్ మ్యాప్‌తో యాప్‌ను అనుసంధానించారు. ఏ మండపం వద్దయినా ఘర్షణ జరిగినట్లుగా సమాచారం వస్తే ఆ మండపం అడ్రస్ వెతకాల్సిన అవసరం లేకుండా జియో ట్యాగింగ్ ద్వారా కేవలం 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

(5 / 8)

మండపాల వద్దకు ఎలా వెళ్లాలి, ఏదైనా అనుచిత సంఘటనలు జరిగినప్పుడు త్వరగా చేరుకునే విధంగా గూగుల్ మ్యాప్‌తో యాప్‌ను అనుసంధానించారు. ఏ మండపం వద్దయినా ఘర్షణ జరిగినట్లుగా సమాచారం వస్తే ఆ మండపం అడ్రస్ వెతకాల్సిన అవసరం లేకుండా జియో ట్యాగింగ్ ద్వారా కేవలం 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

జగిత్యాల జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్‌ల పెట్రోలింగ్, బ్లూ కోట్స్ వాహనాలతో రాత్రి, పగలు గణేష్ మండపాలతో పాటు అన్ని ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ వివరించారు.  

(6 / 8)

జగిత్యాల జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్‌ల పెట్రోలింగ్, బ్లూ కోట్స్ వాహనాలతో రాత్రి, పగలు గణేష్ మండపాలతో పాటు అన్ని ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ వివరించారు. 
 

జిల్లాలో నవరాత్రుల సందర్బంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రతి మండపం వద్ద విధిగా సీసీ కెమెరాలు అమర్చుకునే విధంగా మండపాల నిర్వాహకులలో అవగాహన కల్పించామని ఆయన అన్నారు.  

(7 / 8)

జిల్లాలో నవరాత్రుల సందర్బంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రతి మండపం వద్ద విధిగా సీసీ కెమెరాలు అమర్చుకునే విధంగా మండపాల నిర్వాహకులలో అవగాహన కల్పించామని ఆయన అన్నారు. 
 

ప్రజలంతా పోలీసులకు సహకరించాలని, గణేష్ నవరాత్రులు, నిమజ్జనం నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారం లాంటి సమాచారాన్ని బాధ్యత కలిగిన పౌరులుగా పోలీసులకు తెలిపాలని ఎస్పీ అశోక్ కుమార్ కోరారు.

(8 / 8)

ప్రజలంతా పోలీసులకు సహకరించాలని, గణేష్ నవరాత్రులు, నిమజ్జనం నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారం లాంటి సమాచారాన్ని బాధ్యత కలిగిన పౌరులుగా పోలీసులకు తెలిపాలని ఎస్పీ అశోక్ కుమార్ కోరారు.

ఇతర గ్యాలరీలు