Foods to increase Immunity : చలికాలంలో వచ్చే జబ్బులకు దూరంగా ఉండాలంటే ఇవి తినండి-foods to increase immunity specially in winter ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Foods To Increase Immunity Specially In Winter

Foods to increase Immunity : చలికాలంలో వచ్చే జబ్బులకు దూరంగా ఉండాలంటే ఇవి తినండి

Oct 20, 2022, 09:24 PM IST Geddam Vijaya Madhuri
Oct 20, 2022, 09:24 PM , IST

  • మీ బరువు నుంచి జలుబు వరకు వచ్చే ప్రతిదీ మీ ఆహారంతో ముడిపడి ఉంటుంది. సరైన సమతుల్య ఆహారం తీసుకోకపోతే.. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆరోగ్యవంతమైన జీవితానికి పౌష్టికాహారం అవసరం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రొటీన్లు, విటమిన్ బి12, ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తినండి.

(1 / 8)

ఆరోగ్యవంతమైన జీవితానికి పౌష్టికాహారం అవసరం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రొటీన్లు, విటమిన్ బి12, ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తినండి. (Pixabay)

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చేప ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. వారానికి కనీసం 3 రోజులు చేపలు తినండి. అయితే చేపలను ఎక్కువగా ఉడకబెట్టడం లేదా పులుసులో ఎక్కువగా ఉడికించడం చేయవద్దు. సరైన స్థాయిలోనే ఉడికించాలి. అతిగా ఉడికించడం వల్ల విటమిన్లు నశిస్తాయి.

(2 / 8)

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చేప ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. వారానికి కనీసం 3 రోజులు చేపలు తినండి. అయితే చేపలను ఎక్కువగా ఉడకబెట్టడం లేదా పులుసులో ఎక్కువగా ఉడికించడం చేయవద్దు. సరైన స్థాయిలోనే ఉడికించాలి. అతిగా ఉడికించడం వల్ల విటమిన్లు నశిస్తాయి. (Pixabay)

పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు పెరుగులో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా శరీరానికి చాలా అవసరం. ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరుగుతుంది.

(3 / 8)

పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు పెరుగులో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా శరీరానికి చాలా అవసరం. ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరుగుతుంది. (Pixabay)

శీతాకాలంలో జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో పుట్టగొడుగులు సహాయపడతాయి. ఓస్టెర్ మష్రూమ్, బటన్ మష్రూమ్, బ్రౌన్ మష్రూమ్ ఇలా ఎన్నో రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. వంట చేయడం కూడా కష్టం కాదు. మిరియాలు, వెల్లుల్లితో నూనె లేదా కొద్దిగా వెన్నలో వేయించవచ్చు. మీరు దీన్ని సూప్, నూడుల్స్‌తో కూడా తీసుకోవచ్చు.

(4 / 8)

శీతాకాలంలో జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో పుట్టగొడుగులు సహాయపడతాయి. ఓస్టెర్ మష్రూమ్, బటన్ మష్రూమ్, బ్రౌన్ మష్రూమ్ ఇలా ఎన్నో రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. వంట చేయడం కూడా కష్టం కాదు. మిరియాలు, వెల్లుల్లితో నూనె లేదా కొద్దిగా వెన్నలో వేయించవచ్చు. మీరు దీన్ని సూప్, నూడుల్స్‌తో కూడా తీసుకోవచ్చు.(Pixabay)

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. తెల్ల రక్త కణాలను పెంచే శక్తి దీనికి ఉంది.

(5 / 8)

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. తెల్ల రక్త కణాలను పెంచే శక్తి దీనికి ఉంది. (Pinterest)

కోడి మాంసంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది మన శరీరంలో తెల్లరక్తకణాలు మరియు టి కణాలను పెంచుతుంది. దేశీయ చికెన్‌లో రోగనిరోధక శక్తిని పెంచే ఖనిజ జింక్ ఉంటుంది. ఫలితంగా వారానికి 1-2 రోజులు మీ హృదయపూర్వకంగా చికెన్ తినండి.

(6 / 8)

కోడి మాంసంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది మన శరీరంలో తెల్లరక్తకణాలు మరియు టి కణాలను పెంచుతుంది. దేశీయ చికెన్‌లో రోగనిరోధక శక్తిని పెంచే ఖనిజ జింక్ ఉంటుంది. ఫలితంగా వారానికి 1-2 రోజులు మీ హృదయపూర్వకంగా చికెన్ తినండి.(pixabay)

డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహం, గుండె సమస్యలు ఉన్నవారికి డార్క్ చాక్లెట్ చాలా మంచిది.

(7 / 8)

డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహం, గుండె సమస్యలు ఉన్నవారికి డార్క్ చాక్లెట్ చాలా మంచిది.(Pixabay)

సంబంధిత కథనం

Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.శనివారం, ఏప్రిల్ 20, 2024 ఏ రాశుల వారు లాభాన్ని చూడబోతున్నారో చూడండి. మేషం నుండి మీనం వరకు ఈ 12 రాశులలో ఎవరికి లాభాలు వస్తాయో తెలుసుకోండి.ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 9 లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్(Telangana Inter Results) ఎప్పుడు వస్తాయనేది ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు.లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో శుక్రవారం ఉదయమే ఓటు వేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి.కలలకు ఎన్నో అర్థాలు ఉంటాయి. కలలపై ఎన్నో అధ్యయనాలు సాగాయి. కలలు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. ఎలాంటి కలలకు ఎలాంటి అర్ధమో తెలుసుకోండి.గ్రహాలలో బుధుడు తెలివితేటలు, మాటల చాతుర్యానికి మారుపేరు.   ఏప్రిల్ 19న ఉదయం 10 : 23 గంటలకు మీన రాశిలో బుధుడు ఉదయిస్తాడు. బుధుడి పెరుగుదల కారణంగా, కొన్ని రాశుల వారికి గొప్ప ఉపశమనం లభిస్తుంది. అవి ఏ రాశులో తెలుసుకోండి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు