(1 / 5)
నిత్యం కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు నీటిని తీసుకోవడం తప్పనిసరి. కొందరు పనిలో పడితే ఈ విషయం గుర్తుండకపోవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఫోన్లో అలారం పెట్టుకోవచ్చు. లేదంటే ఇటీవల వాటర్ ట్రాకింగ్ యాప్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. వాటిని వాడినా మంచిదే.
(istockphoto)(2 / 5)
నిమ్మ, పుదీన, బెర్రీలు, ఆరెంజ్, కీరదోస ముక్కలను ఎక్కువసేపు నానబెట్టిన నీటిని తాగితే శరీరానికి మేలు చేస్తుంది. పుచ్చకాయ, బొప్పాయి, ముల్లంగి, గుమ్మడికాయ, నారింజ, ద్రాక్ష, టమాట, ఆకుకూరలు.. ఇలా పండ్లు, కూరగాయల రూపంలోనూ శరీరానికి నీటిని అందించవచ్ఛు .
(istockphoto)(3 / 5)
నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లలోని విటమిన్లు, పోషకాలు శక్తిని ఇస్తాయి. అవసరమైన ఎలక్టోల్రైట్లను కలిగి ఉండటం వల్ల మేలు చేస్తాయి. వీటితో సలాడ్స్ చేసుకొని తినొచ్చు.
(istockphoto)(4 / 5)
బయటికి వెళ్లే సమయంలో మజ్జిగ, నిమ్మరసం, చెరకు రసం వంటివి తాగితే.. ఎండదెబ్బ బారిన పడకుండా ఉండగలం. బయటి నుంచి తిరికి ఇంటికొచ్చాక తాగినా అవి శరీరాన్ని చల్లబరుస్తాయి.
(istockphoto)ఇతర గ్యాలరీలు