Control Sleepiness | మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- మధ్యాహ్నం బాగా భోజనం చేసిన తర్వాత కొందరికి నిద్ర ముంచుకొస్తుంది, ఇక పని పక్కనపెట్టి హాయిగా నిద్రపోతారు. అయితే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే తాజాగా, అలర్ట్గా ఉండగలుగుతారు.
- మధ్యాహ్నం బాగా భోజనం చేసిన తర్వాత కొందరికి నిద్ర ముంచుకొస్తుంది, ఇక పని పక్కనపెట్టి హాయిగా నిద్రపోతారు. అయితే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే తాజాగా, అలర్ట్గా ఉండగలుగుతారు.
(1 / 8)
లంచ్ టైంలో ఎక్కువగా భోజనం చేసిన ప్రతిసారీ ఆపలేని నిద్ర వస్తుంది. కాసేపు నిద్రపోయి, లేచిన తర్వాత కూడా మగతగా, బలహీనంగా అనిపించవచ్చు. బద్ధకం ఆవహించవచ్చు. ఈ సమస్యను ప్రస్తావిస్తూ పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీనిద్ర పట్టకుండా మధ్యాహ్న భోజనం ఎలా ఉండాలో వివరించారు.(Unsplash)
(2 / 8)
ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర ఆవహిస్తున్న అనుభూతి చాలా మందికి ఉంటుంది. సాధారణంగా మనం భోజనంలో తీసుకునే ఆహారం వల్ల ఇది జరుగుతుంది.(Unsplash)
(3 / 8)
ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే అవి మనల్ని తాజాగా, ఫిట్గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ రకమైన భోజనం మధ్యాహ్నం నిద్ర మబ్బును కంట్రోల్ చేయగలదు.(Unsplash)
(4 / 8)
మధ్యాహ్న భోజనానంలో కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. ఎందుకంటే అవి మగతను కలిగిస్తాయి.(Unsplash)
(5 / 8)
నిద్ర మబ్బు కలగకుండా ఉండాలంటే లంచ్ టైంలో పిజ్జా, దోశ, అన్నం కూర వంటివి తీసుకోకూడదు.(Unsplash)
(6 / 8)
ఇక బిర్యానీ లాంటివి తింటే తినేటపుడు బాగానే ఉంటుంది కానీ, తిన్న తర్వాత గాఢమైన నిద్ర వస్తుంది. ఇక మీ పని సమాప్తమే. కాబట్టి పనిచేసేటపుడు లంచ్ టైంలో బిర్యానీ వద్దు.(Unsplash)
(7 / 8)
గ్రిల్డ్ చికెన్, వెజిటేబుల్స్, సలాడ్లను మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. ఇవి మూడ్ మెరుగుపరుస్తాయి.(Unsplash)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు