AP Tourism : సముద్ర తీరం, పచ్చటి కొండలు, పురాతన ఆలయాలు.. నెల్లూరు జిల్లా అందాలు చూడతరమా!-features of 6 popular tourist destinations in nellore district ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tourism : సముద్ర తీరం, పచ్చటి కొండలు, పురాతన ఆలయాలు.. నెల్లూరు జిల్లా అందాలు చూడతరమా!

AP Tourism : సముద్ర తీరం, పచ్చటి కొండలు, పురాతన ఆలయాలు.. నెల్లూరు జిల్లా అందాలు చూడతరమా!

Dec 27, 2024, 12:03 PM IST Basani Shiva Kumar
Dec 27, 2024, 12:03 PM , IST

  • AP Tourism : నెల్లూరు జిల్లా.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు నిలయం. సముద్ర తీరం, పచ్చటి కొండలు, పురాతన ఆలయాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలతో.. ఈ జిల్లా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ జిల్లాలో చూడవలసిన అనేక ప్రదేశాలున్నాయి. వాటిల్లో 6 ప్రాంతాల విశేషాలు ఇలా ఉన్నాయి.

మైపాడు బీచ్.. నెల్లూరు నుండి కొద్ది దూరంలో ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం కోరుకునే పర్యాటకులు ఇక్కడికి వస్తారు. సముద్ర తీరాన నడక, స్నానం చేయడం, సూర్యాస్తమాన్ని వీక్షించడం ఇక్కడి ప్రత్యేకతలు. 

(1 / 6)

మైపాడు బీచ్.. నెల్లూరు నుండి కొద్ది దూరంలో ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం కోరుకునే పర్యాటకులు ఇక్కడికి వస్తారు. సముద్ర తీరాన నడక, స్నానం చేయడం, సూర్యాస్తమాన్ని వీక్షించడం ఇక్కడి ప్రత్యేకతలు. 

పులికాట్ సరస్సు.. భారతదేశంలోని రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా పేరుగాంచింది. ఈ సరస్సు వలస పక్షులకు నిలయం. సరస్సు చుట్టూ ఉన్న అడవి ప్రాంతం, జీవ వైవిధ్యం పర్యాటకులను ఆకర్షిస్తాయి. బోట్‌ టూర్, పక్షులను చూడడం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

(2 / 6)

పులికాట్ సరస్సు.. భారతదేశంలోని రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా పేరుగాంచింది. ఈ సరస్సు వలస పక్షులకు నిలయం. సరస్సు చుట్టూ ఉన్న అడవి ప్రాంతం, జీవ వైవిధ్యం పర్యాటకులను ఆకర్షిస్తాయి. బోట్‌ టూర్, పక్షులను చూడడం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం.. పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. శ్రీరంగం, శ్రీరంగపట్టణం తర్వాత భారతదేశంలోని మూడో రంగనాథస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం అత్యంత అద్భుతంగా ఉంటుంది.

(3 / 6)

శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం.. పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. శ్రీరంగం, శ్రీరంగపట్టణం తర్వాత భారతదేశంలోని మూడో రంగనాథస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం అత్యంత అద్భుతంగా ఉంటుంది.

వివిధ రకాల పక్షులను చూడాలనుకునే పర్యాటకులకు.. నెలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ సంరక్షణ కేంద్రంలో వందలాది రకాల పక్షులను చూడవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఆసక్తిగా పక్షులను చూసే అవకాశం ఉంటుంది.

(4 / 6)

వివిధ రకాల పక్షులను చూడాలనుకునే పర్యాటకులకు.. నెలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ సంరక్షణ కేంద్రంలో వందలాది రకాల పక్షులను చూడవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఆసక్తిగా పక్షులను చూసే అవకాశం ఉంటుంది.

పెంచలకోన జలపాతం.. ప్రకృతి ప్రేమికులకు స్వర్గం. పచ్చటి కొండల మధ్య ఉన్న ఈ జలపాతం చూడడానికి అద్భుతంగా ఉంటుంది. జలపాతం దగ్గర స్నానం చేయడం, చుట్టూ ఉన్న అడవిలో తిరగడం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.

(5 / 6)

పెంచలకోన జలపాతం.. ప్రకృతి ప్రేమికులకు స్వర్గం. పచ్చటి కొండల మధ్య ఉన్న ఈ జలపాతం చూడడానికి అద్భుతంగా ఉంటుంది. జలపాతం దగ్గర స్నానం చేయడం, చుట్టూ ఉన్న అడవిలో తిరగడం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.

సముద్రమట్టానికి 379 అడుగుల ఎత్తులో ఉన్న ఉదయగిరి కోట.. చారిత్రక ప్రాముఖ్యత కలిగినది. ఈ కోట నుండి చుట్టుపక్కల ప్రాంతాల అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఈ కోట నిర్మాణ శైలి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ కోటను మొదట నిర్మించింది పల్లవులు. తర్వాత చోళులు ఆక్రమించుకున్నారు.

(6 / 6)

సముద్రమట్టానికి 379 అడుగుల ఎత్తులో ఉన్న ఉదయగిరి కోట.. చారిత్రక ప్రాముఖ్యత కలిగినది. ఈ కోట నుండి చుట్టుపక్కల ప్రాంతాల అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఈ కోట నిర్మాణ శైలి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ కోటను మొదట నిర్మించింది పల్లవులు. తర్వాత చోళులు ఆక్రమించుకున్నారు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు