Anna Lezhneva : తిరుమల చేరుకున్న అన్నాలెజినోవా, స్వామివారికి తలనీలాలు సమర్పణ-dy cm pawan kalyan wife anna lezhneva arrived in tirumala visit lord venkateswara tomorrow ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Anna Lezhneva : తిరుమల చేరుకున్న అన్నాలెజినోవా, స్వామివారికి తలనీలాలు సమర్పణ

Anna Lezhneva : తిరుమల చేరుకున్న అన్నాలెజినోవా, స్వామివారికి తలనీలాలు సమర్పణ

Updated Apr 13, 2025 08:43 PM IST Bandaru Satyaprasad
Updated Apr 13, 2025 08:43 PM IST

Anna Lezhneva : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల తిరుమల చేరుకున్నారు. రేపు వేకువజామున తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటారు. ఆమె టీటీడీ నిబంధనల మేరకు డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల తిరుమల చేరుకున్నారు. రేపు వేకువజామున తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటారు.

(1 / 8)

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కొణిదల తిరుమల చేరుకున్నారు. రేపు వేకువజామున తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటారు.

తిరుమల చేరుకున్న అన్నా లెజినోవా కొణిదల..గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు.

(2 / 8)

తిరుమల చేరుకున్న అన్నా లెజినోవా కొణిదల..గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు.

అన్నా లెజినోవా ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆమె సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.

(3 / 8)

అన్నా లెజినోవా ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆమె సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.

సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో తిరుమల స్వామి వారికి దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి అన్నా లెజినోవా తిరుమల వచ్చారు.

(4 / 8)

సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో తిరుమల స్వామి వారికి దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి అన్నా లెజినోవా తిరుమల వచ్చారు.

ఇటీవల సింగపూర్ సమ్మర్ క్యాంప్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. మార్క్ శంకర్ కోలుకోవడంతో ఇండియా తీసుకొచ్చారు.

(5 / 8)

ఇటీవల సింగపూర్ సమ్మర్ క్యాంప్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. మార్క్ శంకర్ కోలుకోవడంతో ఇండియా తీసుకొచ్చారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అన్నా కొణిదల మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వరాహ స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం పద్మావతి కళ్యాణ కట్టలో భక్తులందరితో పాటు తలనీలాలు సమర్పించారు.

(6 / 8)

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అన్నా కొణిదల మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వరాహ స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం పద్మావతి కళ్యాణ కట్టలో భక్తులందరితో పాటు తలనీలాలు సమర్పించారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దంపతులు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి ఇవాళ ఇండియాకు తిరిగొచ్చారు.  మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడిందని, కోలుకుంటున్నాడని పవన్ కల్యాణ్ తెలిపారు.

(7 / 8)

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దంపతులు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి ఇవాళ ఇండియాకు తిరిగొచ్చారు. మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడిందని, కోలుకుంటున్నాడని పవన్ కల్యాణ్ తెలిపారు.

అన్నా కొణిదల సోమవారం వేకువజామున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తారు. సుప్రభాత సమయంలో స్వామి వారిని దర్శించుకుంటారు. టీటీడీ అధికారులకు నిత్యాన్నదానానికి విరాళం అందిస్తారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరిస్తారు.

(8 / 8)

అన్నా కొణిదల సోమవారం వేకువజామున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తారు. సుప్రభాత సమయంలో స్వామి వారిని దర్శించుకుంటారు. టీటీడీ అధికారులకు నిత్యాన్నదానానికి విరాళం అందిస్తారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరిస్తారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు