అర్హతలున్నా ఇందిరమ్మ ఇళ్లు రాలేదా...? మీ కోసమే సర్కార్ సరికొత్త ఆలోచన..! త్వరలోనే కేటాయింపులు-double bedroom houses will be allotted to those who cannot get indiramma houses ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  అర్హతలున్నా ఇందిరమ్మ ఇళ్లు రాలేదా...? మీ కోసమే సర్కార్ సరికొత్త ఆలోచన..! త్వరలోనే కేటాయింపులు

అర్హతలున్నా ఇందిరమ్మ ఇళ్లు రాలేదా...? మీ కోసమే సర్కార్ సరికొత్త ఆలోచన..! త్వరలోనే కేటాయింపులు

Published Jun 21, 2025 11:26 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 21, 2025 11:26 AM IST

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. విడతల వారీగా అర్హులను గురిస్తున్నారు. చాలా గ్రామాల్లో పోసిడింగ్స్ కాపీలను అందజేస్తున్నారు. అయితే ఇళ్ల స్థలాలు లేనివారితో పాటు అర్హత ఉన్నవారి విషయంలో ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు షురూ అయ్యాయి. మొదటి విడతలో లబ్ధిదారులుగా గుర్తించినవారు… నిర్మాణ పనులు చేస్తున్నారు. చాలాచోట్ల ముగ్గుపోయటం నుంచి బేస్ మెంట్ వరకు పనులు పూర్తయ్యాయి,

(1 / 7)

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు షురూ అయ్యాయి. మొదటి విడతలో లబ్ధిదారులుగా గుర్తించినవారు… నిర్మాణ పనులు చేస్తున్నారు. చాలాచోట్ల ముగ్గుపోయటం నుంచి బేస్ మెంట్ వరకు పనులు పూర్తయ్యాయి,

 ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 గృహాలు మంజూరు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీన్ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అర్హులైన వారిని గుర్తించి… ఇళ్లను మంజూరు చేస్తామని చెబుతోంది.

(2 / 7)

ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 గృహాలు మంజూరు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీన్ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అర్హులైన వారిని గుర్తించి… ఇళ్లను మంజూరు చేస్తామని చెబుతోంది.

అయితే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో సొంత జాగ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొదటి విడతలో ఎక్కువ మందిని ఈ కేటగిరి కిందనే గుర్తించారు. అయితే ఖాళీ జాగలు లేని వారు ఆందోళన చెందుతన్నారు. తమ విషయంలో ప్రభుత్వం ఆలోచించి… ఇళ్ల నిర్మించాలని కోరుతున్నారు.

(3 / 7)

అయితే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో సొంత జాగ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొదటి విడతలో ఎక్కువ మందిని ఈ కేటగిరి కిందనే గుర్తించారు. అయితే ఖాళీ జాగలు లేని వారు ఆందోళన చెందుతన్నారు. తమ విషయంలో ప్రభుత్వం ఆలోచించి… ఇళ్ల నిర్మించాలని కోరుతున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు అర్హత ఉన్నప్పటికీ ఖాళీ జాగ లేని వారి విషయంలో ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవలే రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

(4 / 7)

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు అర్హత ఉన్నప్పటికీ ఖాళీ జాగ లేని వారి విషయంలో ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవలే రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

గత ప్రభుత్వం చేపట్టి అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 69 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులే స్వయంగా పూర్తి చేసుకునేలా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. త్వరలోనే ఆ ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించారు.

(5 / 7)

గత ప్రభుత్వం చేపట్టి అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 69 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులే స్వయంగా పూర్తి చేసుకునేలా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. త్వరలోనే ఆ ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించేందుకు అర్హులను గుర్తించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఆ దిశగా కసరత్తు పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

(6 / 7)

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించేందుకు అర్హులను గుర్తించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఆ దిశగా కసరత్తు పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

అర్హులను గుర్తించినప్పటికీ… లాటరీ విధానంలో ఇళ్లను కేటాయించే విషయంపై సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

(7 / 7)

అర్హులను గుర్తించినప్పటికీ… లాటరీ విధానంలో ఇళ్లను కేటాయించే విషయంపై సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు