(1 / 12)
ఈ ఏడాది తొలి పెను తుపాను రెమాల్ తుపాను తీరప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఈ తుపాను కారణంగా బంగ్లాదేశ్, భారత్ లలో 16 మంది మరణించారు.
(AFP)(2 / 12)
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 10 మంది చనిపోయారని బంగ్లాదేశ్ విపత్తు నిర్వహణ, సహాయ శాఖ మంత్రి మొహిబుర్ రెహ్మాన్ మంగళవారం తెలిపారు.
(REUTERS)(3 / 12)
మృతుల్లో కొందరు నీటమునిగిపోగా, మరికొందరు ఇళ్లు కూలడంతో చనిపోయారని తీర ప్రాంత అధికారులు తెలిపారు.
(PTI)(4 / 12)
మృతుల్లో భోలా, బరిసాల్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, సత్ఖిరా, ఖుల్నా, చిట్టగాంగ్, పతువాఖలి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
(AFP)(5 / 12)
(6 / 12)
(7 / 12)
ఆదివారం అర్ధరాత్రి తీరం దాటిన తర్వాత గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, సోమవారం ఉదయం 'రెమల్' తుపాను స్థాయికి బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది.
(AFP)(8 / 12)
రెమల్ తుపాను ఆదివారం తీరం దాటడంతో బంగ్లాదేశ్, భారత్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడటం, చెట్లు నేలకూలడంతో లక్షలాది మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
(REUTERS)(9 / 12)
(10 / 12)
కోల్ కతాలో రెమల్ తుపాను ప్రభావంతో ఆకాశం మేఘావృతమై, పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
(AFP)(11 / 12)
రెమాల్ తుఫాను కారణంగా కోల్కతా విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను 21 గంటల పాటు నిలిపివేశారు.
(ANI)(12 / 12)
బంగ్లాదేశ్ లోని మోంగ్లా ఓడరేవు, దానిని ఆనుకుని ఉన్న సాగర్ దీవుల తీర ప్రాంతాలను తుపాను దాటేసి గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
(PTI)ఇతర గ్యాలరీలు