(1 / 6)
ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ మొదలైనా సాంకేతిక సమస్యలు మాత్రం వెంటాడుతున్నాయి.
(2 / 6)
కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నట్టు మంత్రి నాదెండ్ల ప్రకటించారు. స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డుల్ని జారీ చేస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. దీంతో అర్హులైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సాంకేతిక సమస్యలు వారిని వేధిస్తున్నాయి.
(3 / 6)
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
(4 / 6)
రేషన్ కార్డుల జారీలో సాంకేతికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో మాత్రమే కొత్త కార్డుల నమోదు ప్రక్రియ జరుగుతోంది. సర్వర్లలో తరచూ సమస్యలు తలెత్తడంతో దరఖాస్తు చేయడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
(5 / 6)
రేషన్ కార్డుల దరఖాస్తు చేయడానికి మీసేవా, ఈసేవ కేంద్రాలకు అవకాశం లేకపోవడం ఇబ్బందిగా మారింది. సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులోక లేకపోవడంతో ప్రజలు వాటి చుట్టూ తిరగాల్సి వస్తోంది.
(6 / 6)
ఏపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రతిపాదిక చేయడంతో ఏదో రూపంలో వాటిని పొందే వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఏపీలో రేషన్ కార్డులు లేని వారి సంఖ్య 20-30లక్షల్లోపు మాత్రమే ఉంది. అనర్హులు కూడా వివిధ మార్గాల్లో రేషన్ కార్డుల్ని పొందేందుకు ప్రస్తుత నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో సరైన పర్యవేక్షణ లేక పోవడంతో ఇబ్బడిముబ్బడిగా రేషన్ కార్డుల్ని మంజూరు చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు