(1 / 10)
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఆదివారం అర్థరాత్రి పదకొండు జిల్లాల్లో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
(2 / 10)
రాజన్న సిరిసిల్లలో 12 డిగ్రీలు, రంగారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, వికారాబాద్, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
(3 / 10)
తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉదయం పది దాటే వరకు సూర్యుడు మంచుతెరల మాటున ఉండిపోతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోయాయి.
(4 / 10)
ఉదయం పూట మంచుతెరలు వీడకపోవడంతో పొగమంచులోనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఉత్తర భారతదేశంలో చలితీవ్రత అధికంగా ఉంది.
(5 / 10)
ఆదివారం అర్థరాత్రి తెలంగాణలోని పదకొండు జిల్లాల్లో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్లకు పరిమితం అవుతున్నారు.
(6 / 10)
చలిగాలులు, మంచు తెరలు వీడకపోయినా పొగమంచులోనే ఉపాధి కోసం వెళుతున్న కూలీలు
(7 / 10)
ఏపీలో కూడా రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. అరకులోయలో 8.9డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
(8 / 10)
తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8డిగ్రీల కంటే కనిష్టానికి తగ్గాయి. తెలంగాణలో సైతం చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో పగటి సమయంలో కూడా మంచుతెరలు వీడటం లేదు.
(9 / 10)
అరకులోయలో 8.9డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మన్యంలోని 11 మండలాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది.
(10 / 10)
గతంతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత అధికం అయ్యింది. సోమవారం రాత్రి అరకులోయలో 8.9డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.7డిగ్రీలు, జి.మాడుగులలో 10డిగ్రీలు, ముంచంగిపుట్టు, హుకుంపేటలో 10.9డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఇతర గ్యాలరీలు