(1 / 6)
ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించారు. సీఎం దంపతులకు అర్చకులు ఘన స్వాగతం పలికారు.
(2 / 6)
కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
(3 / 6)
గంగమ్మ ఆలయం వద్ద వేద పండితులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
(4 / 6)
సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి మంచి జరగాలని అమ్మవారిని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.
(5 / 6)
తిరుపతి గంగమ్మ అమ్మవారి తీర్థ ప్రసాదాలను సీఎం చంద్రబాబు దంపతులు స్వీకరించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం చంద్రబాబు బెంగళూరుకు వెళ్లారు.
(6 / 6)
ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది.
ఇతర గ్యాలరీలు