చల్లంగ చూడమ్మా గంగమ్మ తల్లి… తిరుపతి గంగమ్మ జాతరలో పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు-cm chandra babu couple presented silk clothes at the tirupati gangamma jatara ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  చల్లంగ చూడమ్మా గంగమ్మ తల్లి… తిరుపతి గంగమ్మ జాతరలో పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

చల్లంగ చూడమ్మా గంగమ్మ తల్లి… తిరుపతి గంగమ్మ జాతరలో పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

Published May 21, 2025 07:56 PM IST Sarath Chandra.B
Published May 21, 2025 07:56 PM IST

చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయం పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.

కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మ వారి జాతర సందర్భంగా గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం,టిటిడి తరఫున అమ్మ వారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు.

(1 / 8)

కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మ వారి జాతర సందర్భంగా గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం,టిటిడి తరఫున అమ్మ వారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు.

గంగమ్మ జాతరలో  విశ్వరూప దర్శనమిస్తున్న కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.

(2 / 8)

గంగమ్మ జాతరలో విశ్వరూప దర్శనమిస్తున్న కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.

జాతర కు వచ్చిన ముఖ్యమంత్రి దంపతులు టీటీడీ తరపున గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు తీర్ధప్రసాదాలు అందించారు.

(3 / 8)

జాతర కు వచ్చిన ముఖ్యమంత్రి దంపతులు టీటీడీ తరపున గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు తీర్ధప్రసాదాలు అందించారు.

కుప్పంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలలో చివరి ఘట్టమైన అమ్మ వారి విశ్వరూప దర్శనంతో చల్లని తల్లి కృపా కటాక్షాలు అందరిపై ఉండేలా అనుగ్రహిస్తుందని భక్తుల విశ్వాసం

(4 / 8)

కుప్పంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలలో చివరి ఘట్టమైన అమ్మ వారి విశ్వరూప దర్శనంతో చల్లని తల్లి కృపా కటాక్షాలు అందరిపై ఉండేలా అనుగ్రహిస్తుందని భక్తుల విశ్వాసం

ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని చేసుకుని, రాష్ట్రాన్ని గంగమ్మ చల్లంగా చూడాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన అభివృద్దిపనులు అన్నీ సకాలంలో పూర్తి అయ్యేలా, ప్రజలకు అభివృద్ది ఫలాలు లభించేలా కరుణించాలని ప్రార్థించినట్లు సిఎం తెలిపారు.

(5 / 8)

ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని చేసుకుని, రాష్ట్రాన్ని గంగమ్మ చల్లంగా చూడాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన అభివృద్దిపనులు అన్నీ సకాలంలో పూర్తి అయ్యేలా, ప్రజలకు అభివృద్ది ఫలాలు లభించేలా కరుణించాలని ప్రార్థించినట్లు సిఎం తెలిపారు.

ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు  ప్రభుత్వ విప్  కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం,ఆలయ చైర్మన్ రవిచంద్రబాబు స్వాగతం పలికారు.

(6 / 8)

ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం,ఆలయ చైర్మన్ రవిచంద్రబాబు స్వాగతం పలికారు.

కుప్పంలో జరిగిన గంగమాంబ జాతరలో అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

(7 / 8)

కుప్పంలో జరిగిన గంగమాంబ జాతరలో అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బుధవారం మధ్యాహ్నం తిరుపతి ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతర కోసంకుప్పం వచ్చిన  ముఖ్యమంత్రి దంపతులు అమ్మ వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

(8 / 8)

బుధవారం మధ్యాహ్నం తిరుపతి ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతర కోసంకుప్పం వచ్చిన ముఖ్యమంత్రి దంపతులు అమ్మ వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

ఇతర గ్యాలరీలు