హైదరాబాద్ లో సివిల్ మాక్ డ్రిల్, ప్రధాన కూడళ్లలో మోగిన సైరన్లు-యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన-civil mock drill in hyderabad sirens sounded at major intersections public awareness on war preparedness ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  హైదరాబాద్ లో సివిల్ మాక్ డ్రిల్, ప్రధాన కూడళ్లలో మోగిన సైరన్లు-యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన

హైదరాబాద్ లో సివిల్ మాక్ డ్రిల్, ప్రధాన కూడళ్లలో మోగిన సైరన్లు-యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన

Updated May 07, 2025 05:34 PM IST Bandaru Satyaprasad
Updated May 07, 2025 05:34 PM IST

భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో దేశ వ్యాప్తంగా పలు జిల్లాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటలకు సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో నిర్వహించిన మాక్ డ్రిల్ లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో దేశ వ్యాప్తంగా పలు జిల్లాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటలకు సివిల్ మాక్ డ్రిల్  విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో నిర్వహించిన మాక్ డ్రిల్ లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

(1 / 6)

భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో దేశ వ్యాప్తంగా పలు జిల్లాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటలకు సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో నిర్వహించిన మాక్ డ్రిల్ లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు సైరన్ మోగించారు. హైదరాబాద్‌లోని పలు ప్రధాన కూడళ్లలో సైరన్లు మోగాయి. యుద్ధం వస్తే పౌరులు పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వివరించాయి.

(2 / 6)

జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు సైరన్ మోగించారు. హైదరాబాద్‌లోని పలు ప్రధాన కూడళ్లలో సైరన్లు మోగాయి. యుద్ధం వస్తే పౌరులు పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వివరించాయి.

హైదరాబాద్ లోని నానల్‌నగర్‌, కంచన్‌బాగ్‌, సికింద్రాబాద్‌, ఈసీఐఎల్‌ ఎన్‌ఎఫ్‌సీ ప్రాంతాల్లో జరిగిన మాక్‌ డ్రిల్స్‌ను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

(3 / 6)

హైదరాబాద్ లోని నానల్‌నగర్‌, కంచన్‌బాగ్‌, సికింద్రాబాద్‌, ఈసీఐఎల్‌ ఎన్‌ఎఫ్‌సీ ప్రాంతాల్లో జరిగిన మాక్‌ డ్రిల్స్‌ను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

హైదరాబాద్ లోని సున్నితమైన ప్రదేశాలు ఉన్న నాచారం, కాంచన్‌బాగ్, గోల్కొండ, సికింద్రాబాద్‌లలో మాక్ డ్రిల్‌లు నిర్వహించారు.  మాక్ డ్రిల్‌లలో భాగంగా వైమానిక దాడుల హెచ్చరిక సైరన్‌లు మోగించారు.

(4 / 6)

హైదరాబాద్ లోని సున్నితమైన ప్రదేశాలు ఉన్న నాచారం, కాంచన్‌బాగ్, గోల్కొండ, సికింద్రాబాద్‌లలో మాక్ డ్రిల్‌లు నిర్వహించారు. మాక్ డ్రిల్‌లలో భాగంగా వైమానిక దాడుల హెచ్చరిక సైరన్‌లు మోగించారు.

తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం రేవంత్  రెడ్డి పరిశీలించారు. నగరంలో నిరంతరం నిఘా కొనసాగించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సాగుతున్న పర్యవేక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయడంతో పాటు నిరంతర  పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.

(5 / 6)

తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. నగరంలో నిరంతరం నిఘా కొనసాగించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సాగుతున్న పర్యవేక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయడంతో పాటు నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.

 మాక్‌ డ్రిల్‌లో భాగంగా కొందరు సంఘ విద్రోహ శక్తులు ఒక భవనంలోకి వెళ్లి కాల్పులు జరిపితే, అక్కడి వారిని రక్షించిన విధానం దృశ్యాలను మాక్‌డ్రిల్‌లో ప్రదర్శించారు. డీఆర్‌డీఏ సమీపంలోని ఓ కాలనీలోని 24 అంతస్తుల భవనంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎలా కాపాడాలనే అంశాన్ని ప్రజలకు వివరించారు.

(6 / 6)

మాక్‌ డ్రిల్‌లో భాగంగా కొందరు సంఘ విద్రోహ శక్తులు ఒక భవనంలోకి వెళ్లి కాల్పులు జరిపితే, అక్కడి వారిని రక్షించిన విధానం దృశ్యాలను మాక్‌డ్రిల్‌లో ప్రదర్శించారు. డీఆర్‌డీఏ సమీపంలోని ఓ కాలనీలోని 24 అంతస్తుల భవనంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎలా కాపాడాలనే అంశాన్ని ప్రజలకు వివరించారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు