(1 / 6)
భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో దేశ వ్యాప్తంగా పలు జిల్లాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటలకు సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో నిర్వహించిన మాక్ డ్రిల్ లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
(2 / 6)
జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు సైరన్ మోగించారు. హైదరాబాద్లోని పలు ప్రధాన కూడళ్లలో సైరన్లు మోగాయి. యుద్ధం వస్తే పౌరులు పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వివరించాయి.
(3 / 6)
హైదరాబాద్ లోని నానల్నగర్, కంచన్బాగ్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ ఎన్ఎఫ్సీ ప్రాంతాల్లో జరిగిన మాక్ డ్రిల్స్ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.
(4 / 6)
హైదరాబాద్ లోని సున్నితమైన ప్రదేశాలు ఉన్న నాచారం, కాంచన్బాగ్, గోల్కొండ, సికింద్రాబాద్లలో మాక్ డ్రిల్లు నిర్వహించారు. మాక్ డ్రిల్లలో భాగంగా వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు మోగించారు.
(5 / 6)
తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. నగరంలో నిరంతరం నిఘా కొనసాగించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సాగుతున్న పర్యవేక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయడంతో పాటు నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.
ఇతర గ్యాలరీలు