స్కీమ్ రావాలంటే ఆ స్కోర్ ఉండాల్సిందే - 'రాజీవ్ యువ వికాసం స్కీమ్'కు కొత్త కండిషన్..!-cibil score will be taken into consideration in the implementation of the rajiv yuva vikasam scheme ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  స్కీమ్ రావాలంటే ఆ స్కోర్ ఉండాల్సిందే - 'రాజీవ్ యువ వికాసం స్కీమ్'కు కొత్త కండిషన్..!

స్కీమ్ రావాలంటే ఆ స్కోర్ ఉండాల్సిందే - 'రాజీవ్ యువ వికాసం స్కీమ్'కు కొత్త కండిషన్..!

Published May 07, 2025 04:07 PM IST Maheshwaram Mahendra Chary
Published May 07, 2025 04:07 PM IST

రాజీవ్ యువ వికాసం స్కీమ్ అర్హుల ఎంపిక ప్రక్రియపై తెలంగాణ సర్కార్ కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం మండల స్థాయిలో వెరిఫికేషన్ జరుగుతుండగా… ఆపై జిల్లా కమిటీలకు సిఫార్సు చేస్తారు. ఆ తర్వాత అర్హుల జాబితాలను వెల్లడిస్తారు. అయితే అర్హుల ఎంపికలో సిబిల్ స్కోర్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.

స్వయం ఉపాధి రుణాల మంజూరు కోసం రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి 16 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.

(1 / 8)

స్వయం ఉపాధి రుణాల మంజూరు కోసం రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి 16 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.

భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో ప్రస్తుతం వీటి పరిశీలన కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి… లబ్ధిదారుల జాబితాను వెల్లడించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మండల స్థాయిలో ఏర్పాటైన కమిటీలు త్వరిగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

(2 / 8)

భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో ప్రస్తుతం వీటి పరిశీలన కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి… లబ్ధిదారుల జాబితాను వెల్లడించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మండల స్థాయిలో ఏర్పాటైన కమిటీలు త్వరిగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

మండల స్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయితే   జిల్లా స్థాయి కమిటీకి పంపుతారు. ఇదంతా కూడా మే 20లోపు పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఆ తర్వాత అర్హులను గుర్తించి పత్రాలను అందజేస్తారు. దీనికి జూన్ 2వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

(3 / 8)

మండల స్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయితే జిల్లా స్థాయి కమిటీకి పంపుతారు. ఇదంతా కూడా మే 20లోపు పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఆ తర్వాత అర్హులను గుర్తించి పత్రాలను అందజేస్తారు. దీనికి జూన్ 2వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు దరఖాస్తుదారుల వివరాలన్నింటిని పరిశీలిస్తున్నారు. బ్యాంక్ లింకేజీ రుణం తప్పనిసరి కావటంతో…. దరఖాస్తుదారుడి ‘సిబిల్’ స్కోర్ కూడా కీలకంగా మారింది. సిబిల్‌ స్కోర్ బాగుంటేనే స్కీమ్ కు అర్హత లభించే అవకాశం ఉంది. రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించని వారిని పక్కనపెట్టనున్నారు. ఇదే విషయాన్ని బ్యాంకర్లు… అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రతి దరఖాస్తుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

(4 / 8)

రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు దరఖాస్తుదారుల వివరాలన్నింటిని పరిశీలిస్తున్నారు. బ్యాంక్ లింకేజీ రుణం తప్పనిసరి కావటంతో…. దరఖాస్తుదారుడి ‘సిబిల్’ స్కోర్ కూడా కీలకంగా మారింది. సిబిల్‌ స్కోర్ బాగుంటేనే స్కీమ్ కు అర్హత లభించే అవకాశం ఉంది.

రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించని వారిని పక్కనపెట్టనున్నారు. ఇదే విషయాన్ని బ్యాంకర్లు… అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రతి దరఖాస్తుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద కేటగిరీల వారీగా రాయితీ అందుతుంది. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కేటగిరీ-1 కింద రూ.50 వేల విలువైన యూనిట్‌కు వంద శాతం రాయితీ ఉంటుంది. బ్యాంక్ లింకేజీ లేకుండానే ఈ రుణాన్ని అమలు చేస్తారు. కానీ మిగతా కేటగిరిలో మాత్రం బ్యాంక్ లింకేజీని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

(5 / 8)

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద కేటగిరీల వారీగా రాయితీ అందుతుంది. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కేటగిరీ-1 కింద రూ.50 వేల విలువైన యూనిట్‌కు వంద శాతం రాయితీ ఉంటుంది. బ్యాంక్ లింకేజీ లేకుండానే ఈ రుణాన్ని అమలు చేస్తారు. కానీ మిగతా కేటగిరిలో మాత్రం బ్యాంక్ లింకేజీని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

రూ. 50 వేల రుణానికి బ్యాంకే లింకేజీ లేకపోవటంతో ఇక్కడ సిబిల్ స్కోర్ అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. మిగతా కేటగిరిలో సిబిల్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫలితంగా రాజీవ్ యువ వికాసం స్కీమ్ సిబిల్ స్కోర్ కూడా కీలకంగా మారిపోయింది.

(6 / 8)

రూ. 50 వేల రుణానికి బ్యాంకే లింకేజీ లేకపోవటంతో ఇక్కడ సిబిల్ స్కోర్ అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. మిగతా కేటగిరిలో సిబిల్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫలితంగా రాజీవ్ యువ వికాసం స్కీమ్ సిబిల్ స్కోర్ కూడా కీలకంగా మారిపోయింది.

రూ.50వేల నుంచి రూ.లక్ష, రూ.లక్ష నుంచి రూ.2లక్షలు, రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు, రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వారి వివరాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. అర్హత పత్రాలతో పాటు సిబిల్ స్కోర్ కూడా చేస్తారు. ఏమైనా తేడాలుంటే పక్కన పెట్టే అవకాశం ఉంటుంది.

(7 / 8)

రూ.50వేల నుంచి రూ.లక్ష, రూ.లక్ష నుంచి రూ.2లక్షలు, రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు, రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వారి వివరాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. అర్హత పత్రాలతో పాటు సిబిల్ స్కోర్ కూడా చేస్తారు. ఏమైనా తేడాలుంటే పక్కన పెట్టే అవకాశం ఉంటుంది.

సిబిల్ స్కోర్ తో ముడిపెట్టడంతో పలువురు దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా అర్హులను ఎంపిక చేసి రుణాలను మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

(8 / 8)

సిబిల్ స్కోర్ తో ముడిపెట్టడంతో పలువురు దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా అర్హులను ఎంపిక చేసి రుణాలను మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు