ప్రయాణికులకు శుభవార్త…. సికింద్రాబాద్ - కాజీపేట మధ్య కొత్త రైల్వే లైన్లు, తగ్గనున్న జర్నీ టైమ్..!-central government has decided to expand the secunderabad kazipet railway line to 4 lines ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ప్రయాణికులకు శుభవార్త…. సికింద్రాబాద్ - కాజీపేట మధ్య కొత్త రైల్వే లైన్లు, తగ్గనున్న జర్నీ టైమ్..!

ప్రయాణికులకు శుభవార్త…. సికింద్రాబాద్ - కాజీపేట మధ్య కొత్త రైల్వే లైన్లు, తగ్గనున్న జర్నీ టైమ్..!

Published Oct 11, 2025 07:33 PM IST Maheshwaram Mahendra Chary
Published Oct 11, 2025 07:33 PM IST

తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది. అత్యంత కీలకమైన సికింద్రాబాద్- కాజీపేట రైల్వే మార్గాన్ని 4 లైన్లకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ ద్వారా ఓ ప్రకటన చేశారు.

తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది. అత్యంత కీలకమైన సికింద్రాబాద్- కాజీపేట రైల్వే మార్గాన్ని 4 లైన్లకు విస్తరిస్తూ  నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

(1 / 5)

తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది. అత్యంత కీలకమైన సికింద్రాబాద్- కాజీపేట రైల్వే మార్గాన్ని 4 లైన్లకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ఈ మార్గం ప్రయాణికుల రాకపోకలు, సరుకు రవాణాను సులభతరం చేయడమే కాకుండా, ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదపడనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

(2 / 5)

ఈ మార్గం ప్రయాణికుల రాకపోకలు, సరుకు రవాణాను సులభతరం చేయడమే కాకుండా, ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదపడనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

రైల్వే లైన్ల విస్తరణతో కాజీపేట-సికింద్రాబాద్‌ మధ్య రైలు ప్రయాణం మరింత వేగవంతం కానుంది.

(3 / 5)

రైల్వే లైన్ల విస్తరణతో కాజీపేట-సికింద్రాబాద్‌ మధ్య రైలు ప్రయాణం మరింత వేగవంతం కానుంది.

ఈ సరికొత్త ప్రాజెక్టుతో సికింద్రాబాద్‌-కాజీపేట మధ్య ప్రయాణ సమయం గంట వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నరెండు రైల్వే లైన్ల మధ్య ప్రయాణ సమయం రెండున్నర నుంచి 3 గంటలు పడుతోంది. అదనంగా మరో రెండు లైన్లు ఏర్పాటైతే రైలు వేగం గంటకు 130 నుంచి 150 కి.మీటర్ల వరకు పెంచే అవకాశం ఉంటుంది.

(4 / 5)

ఈ సరికొత్త ప్రాజెక్టుతో సికింద్రాబాద్‌-కాజీపేట మధ్య ప్రయాణ సమయం గంట వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నరెండు రైల్వే లైన్ల మధ్య ప్రయాణ సమయం రెండున్నర నుంచి 3 గంటలు పడుతోంది. అదనంగా మరో రెండు లైన్లు ఏర్పాటైతే రైలు వేగం గంటకు 130 నుంచి 150 కి.మీటర్ల వరకు పెంచే అవకాశం ఉంటుంది.

ఒకేసారి రెండు అదనపు లైన్లను నిర్మించేందుకు రూ.2,837 కోట్లు అవసరమవుతాయని  రైల్వే శాఖ రూపొందించిన డీపీఆర్‌లో పేర్కొంది. అదనంగా రెండు లైన్లను నిర్మించేందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పడుతుందని అంచనా.

(5 / 5)

ఒకేసారి రెండు అదనపు లైన్లను నిర్మించేందుకు రూ.2,837 కోట్లు అవసరమవుతాయని రైల్వే శాఖ రూపొందించిన డీపీఆర్‌లో పేర్కొంది. అదనంగా రెండు లైన్లను నిర్మించేందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పడుతుందని అంచనా.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు