TG Rajiv Yuva Vikasam Scheme : రేషన్ కార్డు లేకున్నా అప్లికేషన్ చేసుకోవచ్చు..! రాజీవ్ యువ వికాసం స్కీమ్ కొత్త అప్డేట్స్-caste certificates issued after 2016 are valid for rajiv yuva vikasam scheme in telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Rajiv Yuva Vikasam Scheme : రేషన్ కార్డు లేకున్నా అప్లికేషన్ చేసుకోవచ్చు..! రాజీవ్ యువ వికాసం స్కీమ్ కొత్త అప్డేట్స్

TG Rajiv Yuva Vikasam Scheme : రేషన్ కార్డు లేకున్నా అప్లికేషన్ చేసుకోవచ్చు..! రాజీవ్ యువ వికాసం స్కీమ్ కొత్త అప్డేట్స్

Published Apr 04, 2025 04:00 AM IST Maheshwaram Mahendra Chary
Published Apr 04, 2025 04:00 AM IST

  • TG Rajiv Yuva Vikasam Scheme Updates : యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తుదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రేషన్ కార్డు లేని వారు ఆదాయ ధ్రువీకరణపత్రం సమర్పించవచ్చని స్పష్టం చేసింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకువచ్చింది. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

(1 / 8)

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకువచ్చింది. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

రూ. ఆరు వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించగా.... అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పలువురు దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో ఈ సమస్యలు ఎదురవుతున్నాయి.

(2 / 8)

రూ. ఆరు వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించగా.... అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పలువురు దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో ఈ సమస్యలు ఎదురవుతున్నాయి.

రేషన్ కార్డుల లేకపోవటంతో చాలా మంది ఈ స్కీమ్ కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డు లేదా పుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారు ఆదాయపత్రం సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు రేషన్ కార్డు, పుడ్ సెక్యూరిటీ కార్డు లేనివారు మీ-సేవా ద్వారా జారీ చేయహడిన ఆదాయ ధ్రువీకరణపత్రం నెంబర్ ను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.

(3 / 8)

రేషన్ కార్డుల లేకపోవటంతో చాలా మంది ఈ స్కీమ్ కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డు లేదా పుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారు ఆదాయపత్రం సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు రేషన్ కార్డు, పుడ్ సెక్యూరిటీ కార్డు లేనివారు మీ-సేవా ద్వారా జారీ చేయహడిన ఆదాయ ధ్రువీకరణపత్రం నెంబర్ ను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.

2016 తర్వాత మీసేవా కేంద్రాల ద్వారా జారీ చేయబడిన కుల ధ్రువీకరణపత్రంతో దరఖాస్తు చేసుకోవచ్చని సర్కార్ తెలిపింది. మరలా కొత్త పత్రంతో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది.

(4 / 8)

2016 తర్వాత మీసేవా కేంద్రాల ద్వారా జారీ చేయబడిన కుల ధ్రువీకరణపత్రంతో దరఖాస్తు చేసుకోవచ్చని సర్కార్ తెలిపింది. మరలా కొత్త పత్రంతో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది.

రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు ఇప్పటి వరకు 7 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఓ ప్రకటన ద్వారా కోరారు.

(5 / 8)

రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు ఇప్పటి వరకు 7 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఓ ప్రకటన ద్వారా కోరారు.

(image source istockphoto)

ఇటీవలే దరఖాస్తుల గడువు ముగియగా... ఈ గడువును ఏప్రిల్‌ 14 వరకు పొడిగించారు. ఆ తర్వాత మండలస్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి యూనిట్లను మంజూరు చేస్తాయి. జూన్‌ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు.

(6 / 8)

ఇటీవలే దరఖాస్తుల గడువు ముగియగా... ఈ గడువును ఏప్రిల్‌ 14 వరకు పొడిగించారు. ఆ తర్వాత మండలస్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి యూనిట్లను మంజూరు చేస్తాయి. జూన్‌ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు.

ఈ స్కీమ్ కింద ఎంపికైన వారికి 7 రోజుల నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్‌ గ్రౌండ్‌ చేసిన తరువాత 6 నెలల నుంచి ఏడాది వరకు శిక్షణ అందిస్తారు. స్కీమ్ అమలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కమిటీ పరిశీలించి... పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటుంది.

(7 / 8)

ఈ స్కీమ్ కింద ఎంపికైన వారికి 7 రోజుల నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్‌ గ్రౌండ్‌ చేసిన తరువాత 6 నెలల నుంచి ఏడాది వరకు శిక్షణ అందిస్తారు. స్కీమ్ అమలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కమిటీ పరిశీలించి... పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటుంది.

ఈ స్కీంలో భాగంగా అర్హులైన యువతకు రూ. 50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ పథకం కోసం రూ.6 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 17 వ తేదీని ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ. 50 వేల లోపు యూనిట్లకు వంద శాతం రాయితీ అందుతుంది. ఈ యూనిట్ల వివరాలను అధికారిక వెబ్ సైట్ (https://tgobmmsnew.cgg.gov.in/ ) లో పొందుపరిచారు.

(8 / 8)

ఈ స్కీంలో భాగంగా అర్హులైన యువతకు రూ. 50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ పథకం కోసం రూ.6 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 17 వ తేదీని ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ. 50 వేల లోపు యూనిట్లకు వంద శాతం రాయితీ అందుతుంది. ఈ యూనిట్ల వివరాలను అధికారిక వెబ్ సైట్ (https://tgobmmsnew.cgg.gov.in/ ) లో పొందుపరిచారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు