(1 / 6)
ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పొలంబాట కార్యక్రమంలో భాగంగా… ఎండిపోయిన పంటలను పరిశీలించారు.
(2 / 6)
ఉదయమే ఎర్రవెల్లి నుంచి బయల్దేరిన కేసీఆర్… కరీంనగర్ చేరుకున్నారు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్ధుంపూర్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు.
(3 / 6)
ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. పలువురు రైతులు కేసిఆర్ ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందవుతుందని తెలిపారు.
(4 / 6)
ఈ సందర్భంగా ఎండిపోయిన పైరును కేసీఆర్ చూపించారు స్థానిక రైతులు. గతేడాది నీటి కొరత లేదని… ఈసారి నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని వాపోయారు.
(5 / 6)
ఈ సందర్భంగా స్పందించిన కేసీఆర్… రైతులకు బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు.
(6 / 6)
రైతులకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని చెప్పారు కేసీఆర్., ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటు స్థానిక నేతలు కేసీఆర్ వెంట ఉన్నారు. ఇవాళ సాయంత్రం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.
ఇతర గ్యాలరీలు