(1 / 10)
కొత్త సంవత్సరం 2025ను ఆహ్వానించేందుకు వెకేషన్లకు వెళ్లారు కొందరు బాలీవుడ్ సినీ స్టార్లు. న్యూఇయర్ ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
(Instagram)(2 / 10)
బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్.. ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు. కుటుంబంతో వెకేషన్లో సంతోషంగా గడుపుతున్నారు.
(Instagram)(3 / 10)
ఈ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో నేడు డిసెంబర్ 31న పోస్ట్ చేశారు కరీనా. ఈ ఏడాది చివరి సెల్ఫీల్లో కొన్ని అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.
(Instagram)(4 / 10)
హీరోయిన్ సోనాక్షి సిన్హా, ఆమె భర్త జహీర్ ఇక్బాల్.. ఆస్ట్రేలియా ట్రిప్కు వెళ్లారు. ట్రిప్ను ఉల్లాసంగా గడుపుతున్నారు.
(Instagram)(5 / 10)
సోనాక్షి, జహీర్.. సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. సముద్రపు అందాలను లోపలికి వెళ్లి చూశారు.
(Instagram)(6 / 10)
గాల్లో తేలుతూ స్కైడైవింగ్, బంగీ జంప్ లాంటి థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ కూడా చేశారు సోనాక్షి, జహీర్. ఈ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.
(Instagram)(7 / 10)
న్యూఇయర్ సందర్భంగా ఫిన్ల్యాండ్ ట్రిప్కు వెళ్లారు బాలీవుడ్ యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రి. హిమపాతంలో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
(Instagram/HT City)(8 / 10)
బాలీవుడ్ సీనియర్ నటి శిల్పా శెట్టి.. ఫిన్ల్యాండ్లోని ల్యాప్లాండ్కు వెకేషన్కు వెళ్లారు. పిల్లలతో సమయం సంతోషంగా గడుపుతున్నారు. ఈ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
(Instagram)(9 / 10)
తమ వెకేషన్ ఫొటోలను సుషానే ఖాన్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఉన్నారు.
(Instagram)(10 / 10)
2025 కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తన భర్త జాకీ భగ్నానీతో కలిసి లండన్కు వెకేషన్కు వెళ్లారు. భర్తతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో రకుల్ పోస్ట్ చేశారు.
(Instagram)ఇతర గ్యాలరీలు