(1 / 10)
శుక్రవారం (ఫిబ్రవరి 21) సాయంత్రం ముంబైలో ఆదర్ జైన్, అలేఖా అద్వానీ వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు కరీనా కపూర్, కరీష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, ఆలియా భట్, సుహానా ఖాన్, గాయత్రి ఖాన్, రేఖ, నీతూ కపూర్తో సహా బాలీవుడ్ తారాలోకం హాజరైంది. జనవరిలో గోవాలో అత్యంత సన్నిహితులు, స్నేహితుల మధ్య ఆదర్, అలేఖా క్రైస్తవ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
(2 / 10)
కరీనా కపూర్ నారింజ రంగు చీరలో అందంగా కనిపించింది. ఆమె తన దుస్తులకు తగినట్లుగా ఆభరణాలు ధరించింది. అలాగే, ఆమె భర్త, దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ బ్లాక్ షెర్వాణిలో కరీనాకు తగినట్లుగా కనిపించాడు.
(3 / 10)
ఇక ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఆలియా భట్ పింక్ రంగు చీరను ధరించింది. అలియా భట్ భర్త, యానిమల్ హీరో రణ్బీర్ కపూర్ బ్లాక్ సూట్, ట్రౌజర్స్ వేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుకల్లో ఈ జంట అందరిని ఆకర్షించింది.
(4 / 10)
ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ క్రీమ్ రంగు బంద్గాలా, ట్రౌజర్స్ ధరించి ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
(5 / 10)
అగ్ర నటి రేఖ ఎరుపు, నలుపు రంగు చీరను ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె భారీ ఆభరణాలను కూడా ధరించింది.
(6 / 10)
బాలీవుడ్ బాద్ షా, స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమార్తె
సుహానా ఖాన్ తెలుపు, బంగారు రంగు లెహంగాను ధరించి ఆదర్ జైన్ పెళ్లికి వచ్చింది. ఆమె పోట్లీ బ్యాగ్తో కెమెరాలకు పోజులిచ్చింది.
(7 / 10)
గాయత్రి ఖాన్ తన తల్లి సవితా చిబ్బర్తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె అలేఖా అద్వానీ వివాహానికి తెలుపు, బేజ్ రంగు దుస్తులను ధరించింది.
(8 / 10)
లైగర్ బ్యూటి అనన్య పాండే ఎరుపు, ఆకుపచ్చ, బంగారు రంగు చీరను ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
(9 / 10)
సిమీ గరేవాల్ క్రీమ్, బంగారు రంగు దుస్తులను ధరించి ఆదర్, అలేఖా వివాహానికి హాజరయ్యారు.
ఇతర గ్యాలరీలు