(1 / 6)
భోగాపురం ఎయిర్ పోర్టు పనులు 71 శాతం పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించారు. పనుల పురోగతిపై జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్షించారు.
(2 / 6)
జీఎంఆర్ ప్రతినిధులతో కలిసి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
(3 / 6)
ఎయిర్ పోర్టు పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. మట్టి పనులు 100% , రన్వే పనులు 97% , టాక్సీ వే పనులు 92%, రూఫింగ్ పనులు 60% ఇప్పటికే పూర్తయ్యాయన్నారు.
(4 / 6)
ఎన్డీఏ కూటమి కేవలం 9 నెలల్లో, ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 23% నుండి 71% పూర్తి చేశాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ ఛేంజర్గా మారనుంది, ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధి రెండింటినీ పెంచుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో, జూన్ 2026 నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు.
(5 / 6)
దేశంలో భోగాపురం ఎయిర్పోర్టు ఒక్కటే అత్యాధునికమైనదని, ఈ విమానాశ్రయంతో దేశ రూపురేఖలు మారనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎయిర్ పోర్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు.
ఇతర గ్యాలరీలు