Bhogapuram Airport : శరవేగంగా భోగాపురం ఎయిర్ పోర్టు పనులు, జూన్ 2026 నాటికి పూర్తి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు-bhogapuram airport construction at rapid pace set for june 2026 completion says union minister ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bhogapuram Airport : శరవేగంగా భోగాపురం ఎయిర్ పోర్టు పనులు, జూన్ 2026 నాటికి పూర్తి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Bhogapuram Airport : శరవేగంగా భోగాపురం ఎయిర్ పోర్టు పనులు, జూన్ 2026 నాటికి పూర్తి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Published Apr 08, 2025 05:27 PM IST Bandaru Satyaprasad
Published Apr 08, 2025 05:27 PM IST

Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్టు పనులు 71 శాతం పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించారు. పనుల పురోగతిపై జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్షించారు. 2026 నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు

భోగాపురం ఎయిర్ పోర్టు పనులు 71 శాతం పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించారు. పనుల పురోగతిపై జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్షించారు.

(1 / 6)

భోగాపురం ఎయిర్ పోర్టు పనులు 71 శాతం పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించారు. పనుల పురోగతిపై జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్షించారు.

జీఎంఆర్ ప్రతినిధులతో కలిసి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

(2 / 6)

జీఎంఆర్ ప్రతినిధులతో కలిసి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఎయిర్ పోర్టు పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.  మట్టి పనులు 100% , రన్‌వే పనులు 97% , టాక్సీ వే పనులు 92%, రూఫింగ్ పనులు 60% ఇప్పటికే పూర్తయ్యాయన్నారు.

(3 / 6)

ఎయిర్ పోర్టు పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. మట్టి పనులు 100% , రన్‌వే పనులు 97% , టాక్సీ వే పనులు 92%, రూఫింగ్ పనులు 60% ఇప్పటికే పూర్తయ్యాయన్నారు.

ఎన్డీఏ కూటమి కేవలం 9 నెలల్లో,  ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 23% నుండి 71% పూర్తి చేశాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ ఛేంజర్‌గా మారనుంది, ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధి రెండింటినీ పెంచుతుంది.  సీఎం చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో, జూన్ 2026 నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు.

(4 / 6)

ఎన్డీఏ కూటమి కేవలం 9 నెలల్లో, ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 23% నుండి 71% పూర్తి చేశాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ ఛేంజర్‌గా మారనుంది, ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధి రెండింటినీ పెంచుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో, జూన్ 2026 నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు.

దేశంలో భోగాపురం ఎయిర్‌పోర్టు ఒక్కటే అత్యాధునికమైనదని, ఈ విమానాశ్రయంతో దేశ రూపురేఖలు మారనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.  భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎయిర్ పోర్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

(5 / 6)

దేశంలో భోగాపురం ఎయిర్‌పోర్టు ఒక్కటే అత్యాధునికమైనదని, ఈ విమానాశ్రయంతో దేశ రూపురేఖలు మారనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎయిర్ పోర్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

ఉత్తరాంధ్ర సంప్రదాయాలు తెలిసేలా ఎయిర్ పోర్టులో కళానిలయం ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తవుతుందన్నారు. ఆయన వెంట మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జీఎంఆర్ ప్రతినిధులు సహా పలువురు ఉన్నారు.

(6 / 6)

ఉత్తరాంధ్ర సంప్రదాయాలు తెలిసేలా ఎయిర్ పోర్టులో కళానిలయం ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తవుతుందన్నారు. ఆయన వెంట మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జీఎంఆర్ ప్రతినిధులు సహా పలువురు ఉన్నారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు