(1 / 5)
బెంగళూరులో గత 3 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వర్షాలకు రోడ్లే కాదు మెట్రో స్టేషన్లు, ఐటీ హబ్లోని ప్రాంగణాలు, స్టేడియం వంటివి నీటమునిగాయి. ప్రజలు వ్యవస్థపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు పర్ఫెక్ట్ నగరం అని జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఒక్క వర్షంతో చెక్ పడిందని అంటున్నారు.
(2 / 5)
భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ప్రాంతాల్లో అధికారులు ఇలా సహాయక చర్యలు చేపట్టారు.
(3 / 5)
బెంగళూరులోని ఓ ప్రాంతంలో సోమవారం తీసిన ఏరియల్ ఫొటో ఇది. బెంగళూరు వీధులు వెన్నిస్ని తలపిస్తున్నాయని ప్రజలు సెటైర్లు వేస్తున్నారు.
(AFP)(4 / 5)
బెంగళూరులు విల్సన్ గార్డెన్లోని ఓ భవనంలోకి నీరు ఇలా చేరింది. వాహనాలు నిటమునిగాయి. పరిస్థితి చక్కబడిన తర్వాత నష్టం గురించి లెక్కలేసుకోవాలని స్థానికులు అంటున్నారు.
(PTI)(5 / 5)
బెంగళూరులోని ఓ దుకాణంలోకి చేరుకున్న వర్షపు నీరు. చాలా చోట్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రజలు వ్యవస్థపై అసంతృప్తిగా ఉన్నారు. “నేను పన్నులు చెల్లిస్తున్నాను. నాకు ఫ్రీబీస్ (ఉచిత పథకాలు) కూడా రావు. నాకు అక్కర్లేదు కూడా! బదులుగా నేను కోరుకునేది ఒక్కటే! వర్షాకాలం రాకముందే కుదేలవ్వని నగరం నాకు కావాలి,” అని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తన ఆవేదనను బయటపెట్టాడు.
(PTI)ఇతర గ్యాలరీలు