(1 / 8)
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి.
(2 / 8)
రాజీవ్ యువ వికాసం పథకం కింద 16 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం వీటి పరిశీలన కొనసాగుతోంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి… లబ్ధిదారులను గుర్తించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
(3 / 8)
ఈ స్కీమ్ అమలులో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ కింద మంజూరు చేసే యూనిట్లకు బ్యాంకు లింకేజీని తప్పనిసరి చేసింది. రాయితీ తీసేయగా… మిగతా వాటాను చెల్లించేందుకు లబ్ధిదారుడు సిద్ధంగా ఉన్నప్పటికీ యూనిట్లు మంజూరు చేసే అవకాశం ఉండదు. బ్యాంక్ లింకేజీ తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది.
(4 / 8)
కేటగిరీల వారీగా ఈ రాయితీ అందుతుంది. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కేటగిరీ-1 కింద రూ.50 వేల విలువైన యూనిట్కు వంద శాతం రాయితీ ఉంటుంది. బ్యాంకు లింకేజీ లేకుండానే ఈ రుణాన్ని అమలు చేస్తారు. కానీ మిగతా కేటగిరిలో మాత్రం బ్యాంక్ లింకేజీని తప్పనిసరిగా అమలు చేయనున్నారు.
(5 / 8)
స్కీమ్ అమలులో పారదర్శకత ఉండటంతో పాటు నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు బ్యాంక్ లింకేజీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేటగిరి 1 తప్ప… మిగతా కేటగిరిల కింద పొందే రుణాలకు తప్పనిసరిగా బ్యాంక్ లింకేజీ ఉండనుంది.
(6 / 8)
ఇక ఈ స్కీమ్ కింద ఎంపికైన వారికి 7 రోజుల నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్ గ్రౌండ్ చేసిన తరువాత 6 నెలల నుంచి ఏడాది వరకు శిక్షణ అందిస్తారు. స్కీమ్ అమలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కమిటీ పరిశీలించి... పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటుంది.
(7 / 8)
జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఆ దిశగా మండల, జిల్లాల స్థాయిలో కసరత్తు కొనసాగుతోంది.
(8 / 8)
రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు సంబంధించి… దరఖాస్తుదారుడి వారి వివరాలను వెబ్ సైట్ లో తెలుసుకునేలా ఆప్షన్ తీసుకువచ్చారు. దరఖాస్తుదారుడి ఐడీ, ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేసి… వివరాలను తెలుసుకోవచ్చు. ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ వివరాలను పొందవచ్చు.
ఇతర గ్యాలరీలు