'బ్యాంక్ లింకేజీ' తప్పనిసరి...! రాజీవ్‌ యువ వికాసం స్కీమ్ తాజా అప్డేట్స్ ఇవే-bank linkage is mandatory for implementation of telangana rajiv yuva vikasam scheme ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  'బ్యాంక్ లింకేజీ' తప్పనిసరి...! రాజీవ్‌ యువ వికాసం స్కీమ్ తాజా అప్డేట్స్ ఇవే

'బ్యాంక్ లింకేజీ' తప్పనిసరి...! రాజీవ్‌ యువ వికాసం స్కీమ్ తాజా అప్డేట్స్ ఇవే

Published Apr 26, 2025 08:17 AM IST Maheshwaram Mahendra Chary
Published Apr 26, 2025 08:17 AM IST

రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు సంబంధించి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ఈ ప్రక్రియను త్వరిగతగతిన పూర్తి చేసి… యూనిట్లను మంజూరు చేస్తారు. అయితే ఈ స్కీమ్ కింద మంజూరు చేసే యూనిట్లకు బ్యాంకు లింకేజీని తప్పనిసరి చేశారు.

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి.

(1 / 8)

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి.

రాజీవ్ యువ వికాసం పథకం కింద 16 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం వీటి పరిశీలన కొనసాగుతోంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి… లబ్ధిదారులను గుర్తించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

(2 / 8)

రాజీవ్ యువ వికాసం పథకం కింద 16 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం వీటి పరిశీలన కొనసాగుతోంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి… లబ్ధిదారులను గుర్తించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఈ స్కీమ్ అమలులో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ స్కీమ్ కింద మంజూరు చేసే యూనిట్లకు బ్యాంకు లింకేజీని తప్పనిసరి చేసింది. రాయితీ తీసేయగా… మిగతా వాటాను చెల్లించేందుకు లబ్ధిదారుడు సిద్ధంగా ఉన్నప్పటికీ యూనిట్లు మంజూరు చేసే అవకాశం ఉండదు. బ్యాంక్ లింకేజీ తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది.

(3 / 8)

ఈ స్కీమ్ అమలులో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ కింద మంజూరు చేసే యూనిట్లకు బ్యాంకు లింకేజీని తప్పనిసరి చేసింది. రాయితీ తీసేయగా… మిగతా వాటాను చెల్లించేందుకు లబ్ధిదారుడు సిద్ధంగా ఉన్నప్పటికీ యూనిట్లు మంజూరు చేసే అవకాశం ఉండదు. బ్యాంక్ లింకేజీ తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది.

కేటగిరీల వారీగా ఈ రాయితీ అందుతుంది. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది.   ఇందులో కేటగిరీ-1 కింద రూ.50 వేల విలువైన యూనిట్‌కు వంద శాతం రాయితీ ఉంటుంది. బ్యాంకు లింకేజీ లేకుండానే ఈ రుణాన్ని అమలు చేస్తారు.  కానీ మిగతా కేటగిరిలో మాత్రం బ్యాంక్ లింకేజీని తప్పనిసరిగా అమలు చేయనున్నారు.

(4 / 8)

కేటగిరీల వారీగా ఈ రాయితీ అందుతుంది. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కేటగిరీ-1 కింద రూ.50 వేల విలువైన యూనిట్‌కు వంద శాతం రాయితీ ఉంటుంది. బ్యాంకు లింకేజీ లేకుండానే ఈ రుణాన్ని అమలు చేస్తారు. కానీ మిగతా కేటగిరిలో మాత్రం బ్యాంక్ లింకేజీని తప్పనిసరిగా అమలు చేయనున్నారు.

స్కీమ్ అమలులో పారదర్శకత ఉండటంతో పాటు నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు బ్యాంక్ లింకేజీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేటగిరి 1 తప్ప… మిగతా కేటగిరిల కింద పొందే రుణాలకు తప్పనిసరిగా బ్యాంక్ లింకేజీ ఉండనుంది.

(5 / 8)

స్కీమ్ అమలులో పారదర్శకత ఉండటంతో పాటు నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు బ్యాంక్ లింకేజీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేటగిరి 1 తప్ప… మిగతా కేటగిరిల కింద పొందే రుణాలకు తప్పనిసరిగా బ్యాంక్ లింకేజీ ఉండనుంది.

ఇక  ఈ స్కీమ్ కింద ఎంపికైన వారికి 7 రోజుల నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్‌ గ్రౌండ్‌ చేసిన తరువాత 6 నెలల నుంచి ఏడాది వరకు శిక్షణ అందిస్తారు. స్కీమ్ అమలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కమిటీ పరిశీలించి... పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటుంది.

(6 / 8)

ఇక ఈ స్కీమ్ కింద ఎంపికైన వారికి 7 రోజుల నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్‌ గ్రౌండ్‌ చేసిన తరువాత 6 నెలల నుంచి ఏడాది వరకు శిక్షణ అందిస్తారు. స్కీమ్ అమలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కమిటీ పరిశీలించి... పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటుంది.

జూన్‌ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఆ దిశగా మండల, జిల్లాల స్థాయిలో కసరత్తు కొనసాగుతోంది.

(7 / 8)

జూన్‌ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఆ దిశగా మండల, జిల్లాల స్థాయిలో కసరత్తు కొనసాగుతోంది.

రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు సంబంధించి… దరఖాస్తుదారుడి వారి వివరాలను వెబ్ సైట్ లో తెలుసుకునేలా ఆప్షన్ తీసుకువచ్చారు. దరఖాస్తుదారుడి ఐడీ, ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేసి… వివరాలను తెలుసుకోవచ్చు. ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ వివరాలను పొందవచ్చు.

(8 / 8)

రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు సంబంధించి… దరఖాస్తుదారుడి వారి వివరాలను వెబ్ సైట్ లో తెలుసుకునేలా ఆప్షన్ తీసుకువచ్చారు. దరఖాస్తుదారుడి ఐడీ, ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేసి… వివరాలను తెలుసుకోవచ్చు. ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ వివరాలను పొందవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు