Arunachalam Tour Package : హైదరాబాద్ నుంచి 'అరుణాచలం' యాత్ర - ఏప్రిల్ నెల టూర్ ప్యాకేజీ వివరాలివే-arunachalam tour package operated by telangana tourism april month 2025 package details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Arunachalam Tour Package : హైదరాబాద్ నుంచి 'అరుణాచలం' యాత్ర - ఏప్రిల్ నెల టూర్ ప్యాకేజీ వివరాలివే

Arunachalam Tour Package : హైదరాబాద్ నుంచి 'అరుణాచలం' యాత్ర - ఏప్రిల్ నెల టూర్ ప్యాకేజీ వివరాలివే

Published Mar 28, 2025 05:31 PM IST Maheshwaram Mahendra Chary
Published Mar 28, 2025 05:31 PM IST

  • TG Tourism Arunachalam Tour Package : తమిళనాడులోని అరుణాచలేశ్వం దర్శనం కోసం తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ… మొత్తం 4 రోజులు ట్రిప్ ఉంటుంది. ప్రస్తుతం ఏప్రిల్ 10వ తేదీన ట్రిప్ అందుబాటులో ఉంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి…

 అరుణాచలేశ్వరుడిని దర్శించుకునేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.  HYDERABAD - ARUNACHALAM' పేరుతో ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన టూర్ తేదీని ప్రకటించింది.

(1 / 8)

అరుణాచలేశ్వరుడిని దర్శించుకునేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. HYDERABAD - ARUNACHALAM' పేరుతో ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన టూర్ తేదీని ప్రకటించింది.

మార్చి నెలలో చూస్తే 10వ తేదీన జర్నీ ఉంది. ఈ తేదీ మిస్ అయితే మళ్లీ మేలో వెళ్లొచ్చు. అందుకు అనుగుణంగా టికెట్లను ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.

(2 / 8)

మార్చి నెలలో చూస్తే 10వ తేదీన జర్నీ ఉంది. ఈ తేదీ మిస్ అయితే మళ్లీ మేలో వెళ్లొచ్చు. అందుకు అనుగుణంగా టికెట్లను ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.

(image source from @hinduacademy X )

మొత్తం నాలుగు  రోజులపాటు ఈ పర్యటన సాగుతోంది.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తారు.

(3 / 8)

మొత్తం నాలుగు రోజులపాటు ఈ పర్యటన సాగుతోంది.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తారు.

తొలి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు. రెండో రోజు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.

(4 / 8)

తొలి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు. రెండో రోజు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.

3వ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు. 4వ రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.

(5 / 8)

3వ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు. 4వ రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.

ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు తెలంగాణ టూరిజం వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. హైదరాబాద్ - అరుణాచంల టూర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

(6 / 8)

ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు తెలంగాణ టూరిజం వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. హైదరాబాద్ - అరుణాచంల టూర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

(Image Source From Arunachalam Temple FB Page)

హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరలు : పెద్దలకు రూ. 8000, చిన్నారులకు రూ. 6400గా నిర్ణయించారు.

(7 / 8)

హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరలు : పెద్దలకు రూ. 8000, చిన్నారులకు రూ. 6400గా నిర్ణయించారు.

తెలంగాణ టూరిజం వెబ్ సైట్ ( https://tourism.telangana.gov.in/tours )లోకి వెళ్లి వివరాలను చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా… ఇతర ప్యాకేజీలను కూడా చూడొచ్చు.

(8 / 8)

తెలంగాణ టూరిజం వెబ్ సైట్ ( https://tourism.telangana.gov.in/tours )లోకి వెళ్లి వివరాలను చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా… ఇతర ప్యాకేజీలను కూడా చూడొచ్చు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు